ITR Filing Deadline: సమయం లేదు మిత్రమా… ఇంకా నాలుగు రోజులే గడువు

ITR Filing Deadline: కొన్నికొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతో ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గడువుతో సంబంధం లేకుండా ముందస్తుగా పనులను..

ITR Filing Deadline: సమయం లేదు మిత్రమా... ఇంకా నాలుగు రోజులే గడువు
Follow us

|

Updated on: Jul 26, 2022 | 8:28 AM

ITR Filing Deadline: కొన్నికొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతో ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గడువుతో సంబంధం లేకుండా ముందస్తుగా పనులను పూర్తి చేసుకుంటే ఎంత మంచిది. ప్రయోజనాలతో పాటు ఇబ్బందులకు కూడా తప్పుతాయి. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు గడువు సమీపిస్తోంది. మీరు ఇంకా ITR ఫైల్ చేయకుంటే ఆలస్యం చేయకుండా ఈ పనిని పూర్తి చేయండి. సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. భారీగా జరిమానా చెల్లించుకోవాలి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్‌ ఫైల్ చేసేందుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం గడువును పొడిగించనుందని కొందరు పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. గడువు పొడిగించకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మొదటి కరోనా వైరస్, తరువాత కొత్తగా ప్రారంభించబడిన ఆదాయపు పన్ను పోర్టల్‌లో లోపం కారణంగా ITR ఫైలింగ్ తేదీని గత రెండేళ్లుగా పొడిగించారు. కానీ ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి పెద్దగా లేనందున గడువు పొడిగించరనే అభిప్రాయం వ్యక్తం అవుతంది.

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. జూలై 20 వరకు 2 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలు అయ్యాయని. జూలై 31 నాటికి దాదాపు 7 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు చేయవలసి ఉంది. చివరి రోజుల్లో సుమారు 4.5 కోట్ల మంది రిటర్న్‌లు దాఖలు చేస్తే, రిటర్న్ ఫైలింగ్ పోర్టల్‌పై భారం పెరిగి సిస్టమ్ నెమ్మదిగా మారే అవకాశం ఉంటుంది. సర్వర్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో రిటర్న్‌లు దాఖలుకు సమయం పట్టవచ్చు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకూడదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ITR కోసం చివరి తేదీ ముగిసిన తర్వాత, పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేవారు ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అతను రూ. 5,000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే అతను ఆలస్య రుసుముగా రూ. 1000 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

సకాలంలో రిటర్నులు దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎంత త్వరగా ఫైల్ చేస్తే, అంత త్వరగా మీ ఖాతాలో రీఫండ్ క్రెడిట్ చేయబడుతుంది. ఇది కాకుండా చివరి తేదీలో రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు తరచుగా తప్పులు జరుగుతాయి. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం