Old Pension Scheme: పాత పెన్షన్‌ విధానం తీసుకురానున్నారా.. అసులు OPS అంటే ఏమిటి..

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈ సందర్భంలో పాత పెన్షన్ స్కీంకు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి...

Old Pension Scheme: పాత పెన్షన్‌ విధానం తీసుకురానున్నారా.. అసులు OPS అంటే ఏమిటి..
Pension Scheme
Follow us

|

Updated on: Feb 23, 2022 | 9:12 AM

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఎన్నికల(Elections 2022) సందడి నెలకొంది. ఈ సందర్భంలో పాత పెన్షన్ స్కీం(OPS)కు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా రాజకీయ ప్రసంగాలు సాగుతున్నాయి. నిజానికి ఈ ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనా.. పాత పెన్షన్ స్కీంకు సంబంధించిన సమస్య మాత్రం జాతీయంగా ప్రాధాన్యమున్న సమస్య. ఇప్పుడు ప్రజలు రాజకీయ పార్టీలను మీకు అవకాశం ఇస్తే, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారా అని సూటిగా ప్రశ్నించే అవకాశమూ ఉంది. నేషనల్ పెన్షన్ స్కీం ఎందుకు తీసుకువచ్చారు? అసలు ప్రస్తుతం ఉన్న(NPS) కు ఇంతకుముందు ఉన్న పాత పెన్షన్ స్కీం అంటే OPS కు మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని అర్ధం చేసుకుందాం.

NPS అమలుకు ముందు ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అధిక పెన్షన్ లభించేది. అతని చివరి జీతంలో 50 శాతం వరకూ పెన్షన్‌గా లెక్కించేవారు. దీని ఆధారంగానే అతనికి జీవితాంతం పెన్షన్ వచ్చేది. సదరు ఉద్యోగి 10 ఏళ్లు ఉద్యోగం చేసినా.. 25 ఏళ్లు పనిచేసినా.. అతని పెన్షన్ జీవితాంతం ఇదే విధంగా లెక్కించేవారు. ఇది ఉద్యోగులకు మంచి ప్రయోజనాన్ని ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పై పెన్షన్ భారం ఎక్కువగా పడేది. ఇది బడ్జెట్‌పై ఒత్తిడిని పెంచుతూ వచ్చేది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జనవరి 1, 2004న నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రక్షణ రంగానికి చెందిన వారిని మినహాయించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ NPS కింద పెన్షన్ లెక్కిస్తున్నారు.

దీంతో రాష్ట్రాలు కూడా స్వచ్ఛందంగా NPSని అమలు చేయాలని కేంద్రం కోరింది. పశ్చిమ బెంగాల్ మినహా, అన్ని రాష్ట్రాలు  NPSలో చేరాయి. NPS కింద, పెన్షన్ గణన బాధ్యత కూడా ఉద్యోగుల భుజాలపై ఉంటుంది. దీని కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక జీతం అలాగే DAలో 10 శాతం అతని పెన్షన్‌ కోసం మినహాయించేవారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగి  NPS ఖాతాకు  సమానమైన మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ జీతం అలాగే డీఏలో 14 శాతం జమ చేస్తారు. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగి మొత్తం సేకరించిన మొత్తంలో 60 శాతాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీని బీమా కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ 40% ఆధారంగా పింఛను లెక్కిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు తమ పింఛను ఎంత ఉంటుందనే విషయం రిటైర్మెంట్ ముందు వరకూ తెలీదు

సాంప్రదాయ వ్యవస్థలో ఉద్యోగులు GPF ప్రయోజనం పొందారు. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినపుడు.. అతనికి భారీ మొత్తంలో సొమ్ము లభించేది. కొత్త పెన్షన్ విధానంలో జీపీఎఫ్ ఆప్షన్ లేదు. సాంప్రదాయ వ్యవస్థ ప్రకారం, ఉద్యోగి తన పెన్షన్‌ను లెక్కించడానికి అతని జీతం నుంచి ఎటువంటి మొత్తాన్ని తీసివేసేవారు కాదు. కానీ  ఇప్పుడు పెన్షన్ కార్పస్‌కి కంట్రిబ్యూట్ చేయడానికి ప్రతి నెలా జీతంలో 10 శాతం మినహాయిస్తున్నారు. NPS  అనేది ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలా ఉంటుంది. NPS ఎలాంటి రాబడికి హామీ ఇవ్వదు. మీరు పొందే పెన్షన్ స్టాక్ మార్కెట్ అలాగే బీమా కంపెనీలపై ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సంప్రదాయ పద్ధతిలో ప్రభుత్వ ఖజానా నుంచి పింఛను చెల్లించేవారు. పెన్షనర్లు ప్రతి ఆరునెలల చివరిలో డియర్‌నెస్ అలవెన్స్ అదే విధంగా పే కమీషన్ల ప్రయోజనాన్ని కూడా పొందేవారు. OPSలో, పదవీ విరమణ సమయంలో రూ. 20 లక్షల వరకు గ్రాట్యుటీ లభిస్తుంది. ఒక ఉద్యోగి తన సర్వీస్ సమయంలో మరణిస్తే, OPSలో కూడా కుటుంబ పెన్షన్ సదుపాయం ఉంది. కుటుంబ పెన్షన్  NPSలో  కూడా ఉంది. అయితే ఉద్యోగి మరణించిన సందర్భంలో NPS ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుంది. మునుపటి సిస్టమ్‌లో, పదవీ విరమణ సమయంలో  పెన్షన్ కు సంబంధించి 40 శాతం లేక్కవేసే నిబంధన ఉంది. అంటే ఉద్యోగి తన  పెన్షన్‌లో 40 శాతాన్ని విక్రయించడం ద్వారా ఏకమొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు కూడా OPS కింద ఆరోగ్య సౌకర్యాల ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, NPSలో అలాంటి సదుపాయం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మీరు విశ్వసించే ముందు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లపై నానాటికీ పెరుగుతున్న భారం కారణంగానే కొత్త పెన్షన్ విధానం అమలు చేయడం జరిగిందనే వాస్తవాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి.

రాష్ట్ర బడ్జెట్‌లు కూడా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ తన వార్షిక బడ్జెట్‌లో 24 శాతాన్ని  జీతాలు అలాగే పెన్షన్ ఖర్చుల కోసం ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం రాజస్థాన్ విషయంలో 34% .  మహారాష్ట్ర విషయంలో 31% గా ఉంది. జీతాలు- పెన్షన్‌లపై హిమాచల్ ప్రదేశ్ ఖర్చు దాని బడ్జెట్‌లో 50 శాతానికి సమానం. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో ఓటర్లుగా  క్యూలో నిలబడతారు. రాష్ట్ర బడ్జెట్‌ల పరిస్థితి గురించి తెలిసిన తర్వాత కూడా పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయడానికి కారణం ఇదే.

Read Also..  Mutual Fund: మీ దగ్గర రూ. 100 ఉన్నాయా.. అయితే మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు..

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..