AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్‌ 1 నుంచి బాదుడు షురూ..! దేశం దాటాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే!

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు పెరగడంతో, భారత విమానయాన రంగం ATF ఖర్చుల పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇది విమాన టిక్కెట్ల ధరలను గణనీయంగా పెంచుతోంది. ప్రభుత్వ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకారం, విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలను ప్రవేశపెడుతున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి బాదుడు షురూ..! దేశం దాటాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే!
Indian Currency 6
SN Pasha
|

Updated on: Mar 23, 2026 | 8:00 AM

Share

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు భారత విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల ద్వారా కనిపించవచ్చని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రతి నెలా మొదటి తేదీన ATF ధరలను సవరించే ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరల ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందన్నారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితులు విమానయాన సంస్థల కార్యకలాపాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం నిరంతరం విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.

ముఖ్యంగా మధ్యప్రాచ్య గమ్యస్థానాలకు సురక్షితమైన సేవలను కొనసాగించడం ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యను ఎదుర్కోవడంలో బహుళ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు శాఖలు కలిసి వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రయాణికులపై భారం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులో దాదాపు 40 శాతం ATF ఖర్చే ఉండటంతో, ఇంధన ధరల పెరుగుదల నేరుగా టిక్కెట్ ధరలపై ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో, భారతీయ విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలను ప్రవేశపెట్టడం ప్రారంభించాయి. ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఆకాష్‌ ఎయిర్‌ వంటి సంస్థలు టిక్కెట్ ధరల్లో అదనపు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ATF ధరలను ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయి, అయితే ఇంధన సర్‌ఛార్జ్‌ను విమానయాన సంస్థలే నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చులను సమతుల్యం చేయడానికి సంస్థలు టిక్కెట్ ధరలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి కొనసాగితే రాబోయే నెలల్లో విమాన ప్రయాణం మరింత ఖరీదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us