AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Loan: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‎బిఐ.. రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం..

దేశంలో ద్రవోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచింది.

SBI Loan: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‎బిఐ.. రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం..
PPF Scheme
Madhavi
| Edited By: |

Updated on: Feb 15, 2023 | 6:05 PM

Share

దేశంలో ద్రవోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. 2022 మే నుంచి వడ్డీ రేట్ల పెంపు షురూ అయ్యింది. తాజాగా  ఫిబ్రవరి 8న రెపో రేటును పెంచింది. 0.25శాతం (25 బేసిస్ పాయింట్ల)ను ఆర్బీఐ పెంచింది. దీంతో కలిపి రెపోరేటును మొత్తంగా 2.50శాతం నుంచి 6.50శాతానికి పెంచేసింది.

అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత దానికి అనుగుణంగా దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచేసి కస్టమర్లకు షాకిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కూడా ఈ జాబితాలో చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును దాదాపు 10 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఈ పెంపు తర్వాత ఎస్బీఐ గృహ రుణం, కారు రుణాలు, విద్యారుణాలు వంటి నెలవారీ చెల్లింపుల మొత్తంగా భారీగానే పెరగనుంది. స్టేట్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టీ నుంచి అంటే ఫిబ్రవరి 15, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.

ఎస్‎బిఐ కొత్త వడ్డీ రేట్లు:

-ఎస్‎బిఐ వెబ్‌సైట్ ప్రకారం, MCLRను 0.10 శాతం మేర పెంచింది.

-ఒక రోజు రుణాలపై వడ్డీ 7.85శాతం నుంచి 7.95శాతానికి పెరిగాయి.

-ఒక నెల రుణాలపై వడ్డీ 8.00శాతం నుంచి 8.10శాతానికి పెరిగాయి.

-మూడు నెలల MCLRను 8 శాతం నుంచి 8.10 శాతానికి పెంచింది.

-ఆరు నెలల MCLR 8.30 శాతం నుంచి ఇప్పుడు 8.40 శాతానికి పెరిగింది.

-ఒక సంవత్సరం MCLR 8.40 శాతం నుండి 8.50 శాతానికి పెరిగింది.

-రెండేళ్ల MCLR 8.50 శాతం నుంచి 8.60 శాతానికి పెంచింది.

-మూడేళ్లMCLR 8.60 శాతం నుంచి 8.70 శాతానికి పెంచింది.

ఎఫ్‌డీ రేట్లు పెంపు..

అదే సమయంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో మార్పులకు అనుగుణంగా ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెంచాయి. దీంతో కస్టమర్లకు అందే రాబడి మరింత పెరగనుంది. ఎఫ్‌డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచగా.. ఈ పెంపు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఎఫ్‌డీ రేటును ఎస్బీఐ పెంచడం గత రెండు మాసాల వ్యవధిలో ఇది రెండోసారి. డిసెంబరు 13న ఎస్బీఐ 65 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?