AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Tunnel: దేశంలోనే తొలిసారి.. అతిపొడవైన 14.57 కి.మీ. సొరంగం పూర్తి!

Railway Tunnel: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ( RVNL ), ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్-కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైల్ లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా భారతదేశంలోనే అతి పొడవైన రవాణా రైల్వే సొరంగం అయిన టన్నెల్-8 మొదటి టీఎంబీ పురోగతిని సాధించింది..

Railway Tunnel: దేశంలోనే తొలిసారి.. అతిపొడవైన 14.57 కి.మీ. సొరంగం పూర్తి!
Subhash Goud
|

Updated on: Apr 21, 2025 | 7:58 PM

Share

ఉత్తరాఖండ్‌లో దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం విజయవంతంగా పూర్తి చేయడంతో భారతదేశం రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక గొప్ప ముందడుగు వేసింది. 14.6 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంజనీరింగ్ అద్భుతం టన్నెల్ T-8 – ప్రతిష్టాత్మకమైన రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో కీలకమైన భాగం. ఇది హిమాలయ రాష్ట్రంలో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ఒక వ్యూహాత్మక ప్రయత్నం.

ఉత్తరాఖండ్‌లోని దేవ్‌ప్రయాగ్- జనసు మధ్య 14.6 కిలోమీటర్ల రైల్వే సొరంగం పురోగతిని రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) పూర్తి చేసింది. ఇది 125 కిలోమీటర్ల రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన రవాణా రైల్వే సొరంగం. ఎల్ అండ్ టీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 125 కిలోమీటర్ల రిషికేశ్-కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పడినట్లయ్యింది.

అత్యాధునిక టెక్నాలజీతో..

అయితే అత్యాధునిక సింగిల్-షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) సహాయంతో ఇది సాధ్యమైంది. 9.11 మీటర్ల వ్యాసంతో హిమాలయ ప్రాంతంలో అతిపెద్ద టీబీఎంగా ఇది నిలిచింది. నెలకు సగటున 413 మీటర్ల వేగంతో తవ్వకం కొనసాగించి 10.4 కిలోమీటర్ల సొరంగ భాగం టీబీఎం ద్వారా పూర్తయ్యింది. మిగిలిన 4.11 కిలోమీటర్లు న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌ఏటీఎం) ద్వారా నిర్మించారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు: అశ్విని వైష్ణవ్

ఈ సొరంగం విజయవంతంగా పూర్తి కావడం పట్ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఉత్తరాఖండ్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సంతోషం వ్యక్తం చేశారు. భారత ఇంజినీరింగ్ సామర్థ్యం, క్లిష్టమైన భూభాగాల్లో రైల్వే సౌకర్యాలను అభివృద్ధి చేసే అంకితభావానికి సాక్ష్యంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ కొనియాడారు. ఈ సొరంగం ఉత్తరాఖండ్‌లోని సుదూర ప్రాంతాలకు కనెక్టివిటీని బలోపేతం చేస్తూ, సామాజిక-ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చి, పర్యాటకం, ఆర్థిక వృద్ధిని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ ముందడుగు ఆర్‌వీఎన్‌ఎల్‌తో సమన్వయం, నిబద్ధతను తెలియజేస్తోందని ఎల్‌అండ్‌టీ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశాయ్ అన్నారు.

Minister

ప్రయాణ సమయం 7 గంటల నుంచి 2 గంటలకు తగ్గింపు:

ఇదిలా ఉండగా, రిషికేశ్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, గౌచర్, కర్ణప్రయాగ్‌లను కలుపుతూ ఈ రైలు మార్గం ప్రయాణ సమయాన్ని 7 గంటల నుంచి 2 గంటలకు తగ్గనుంది. చార్ ధామ్ యాత్రకు వెళ్లే వారికి ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడనుంది. ఎల్‌అండ్‌టీ ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 2, ప్యాకేజీ 4లలో బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్యాకేజీ 4లో, ఎల్‌అండ్‌టీ 14.5 కిలోమీటర్ల అప్‌లైన్, 13.1 కిలోమీటర్ల డౌన్‌లైన్‌తో దేశంలోనే అతిపొడవైన రైల్వే సొరంగాన్ని నిర్మిస్తోంది. ప్యాకేజీ 2లో 26.6 కిలోమీటర్ల సొరంగ తవ్వకం, 28 కిలోమీటర్ల సొరంగ లైనింగ్, రెండు రైల్వే వంతెనలు, ఒక రోడ్డు వంతెన, కట్టడాల నిర్మాణం చేపడుతోంది.

125 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌లో 83% కంటే ఎక్కువ సొరంగాల గుండా వెళుతుంది. దీనికి ప్రధాన, ఎస్కేప్ మార్గాలలో 213 కి.మీ.లకు పైగా సొరంగం అవసరం. ఈ TBM ప్రధాన లాజిస్టికల్, భౌగోళిక సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. ఇంజనీర్లు ముంద్రా ఓడరేవు నుండి ఇరుకైన హిమాలయ రోడ్లు, పాత వంతెనల ద్వారా 165 MT భాగాలను ఆ ప్రదేశానికి రవాణా చేశారు.

ఈ సొరంగం భూకంప జోన్ IVలో ఉంది.  దీనికి అధునాతన డిజైన్ లక్షణాలు, నిరంతర భౌగోళిక పరిశోధన అవసరం. పూర్తయిన తర్వాత ఈ రైలు మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, మారుమూల ప్రాంతాలకు అన్ని వాతావరణాలలో కనెక్టివిటీని అందిస్తుందని, ఉత్తరాఖండ్ అంతటా పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.

మరో వైపు ఈ ప్రాజెక్ట్ ఒక కీలకమైన అడుగు. ఈ విజయం ద్వారా భారతదేశంలోని అత్యంత కష్టతరమైన భూభాగాలలో ఒకటైన ఆధునిక నిర్మాణ సాంకేతికతలకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థగా తన పాత్రను ఆర్‌బీఎన్‌ఎల్‌ బలోపేతం చేసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి