Indian Railways: భారత రైల్వే అరుదైన రికార్డు.. అలాగే 2.5 కోట్ల ఐఆర్సీటీసీ ఖాతాలపై సంచలన నిర్ణయం!
Indian Railways: టికెట్ బుకింగ్లో అత్యంత సవాలుతో కూడిన ప్రక్రియ అయిన తత్కాల్ టికెట్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభతరం చేసింది రైల్వే. గతంలో తత్కాల్ బుకింగ్ 5 నిమిషాల్లోనే పూర్తయ్యేది. దాదాపు 50% లాగిన్ బాట్లు ఇప్పుడు పూర్తిగా తొలగించారు..

డిజిటల్ టికెట్ బుకింగ్లో భారత రైల్వేలు చారిత్రాత్మక మైలురాయిని సాధించాయి. 2025 మే 22న కేవలం ఒక నిమిషంలో 31,814 టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇది ఇప్పటివరకు అతిపెద్ద రికార్డు. దీనితో పాటు టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి రైల్వేలు 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలపై చర్యలు తీసుకుని వాటిని డీయాక్టివేట్ చేసింది రైల్వే.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వేలు తమ టికెట్ బుకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్గా ఆధునీకరించాయని, ఇప్పుడు వెబ్సైట్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత యాంటీ-బాట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది నకిలీ, ఆటోమేటిక్ బుకింగ్లు చేసే బాట్లను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తుంది.
ఇప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ఆలస్యం ఉండదు:
టికెట్ బుకింగ్లో అత్యంత సవాలుతో కూడిన ప్రక్రియ అయిన తత్కాల్ టికెట్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభతరం చేసింది రైల్వే. గతంలో తత్కాల్ బుకింగ్ 5 నిమిషాల్లోనే పూర్తయ్యేది. దాదాపు 50% లాగిన్ బాట్లు ఇప్పుడు పూర్తిగా తొలగించారు. దీని కారణంగా సాధారణ, నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ఎటువంటి ఆలస్యం లేదా ఏజెంట్ జోక్యం ఉండదు.
ఇది కూడా చదవండి: Auto Driver: ఈ ఆటో డ్రైవర్ నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2.5 కోట్ల నకిలీ ఖాతాలపై చర్యలు:
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్గాల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో పాల్గొన్న సుమారు 2.5 కోట్ల నకిలీ వినియోగదారు ఖాతాలను రైల్వేలు మూసివేసాయి. ఈ ఐడీలను నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు లేదా ఏజెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ధృవీకరించిన, అలాగే నిజమైన వినియోగదారులు మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: IRCTC: ప్రయాణికులకు అలర్ట్.. ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం.. ఇలా చేయకపోతే తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేరు
కొత్త మార్గదర్శకాలు అమలు:
ఆధార్ ధృవీకరణ జరగని వినియోగదారులు మూడు రోజుల రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే తత్కాల్, ప్రీమియం తత్కాల్ లేదా ఓపెనింగ్ అడ్వాన్స్ టికెట్ (ARP) బుక్ చేసుకోగలరు. ఆధార్తో ధృవీకరించిన వినియోగదారులు ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే బుక్ చేసుకోవచ్చు. రోజువారీ లాగిన్ల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 69.08 లక్షలు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 82.57 లక్షలకు పెరిగింది (సుమారు 19.53% పెరుగుదల). అదే సమయంలో రోజువారీ టికెట్ బుకింగ్ 11.85% పెరిగింది. ఇప్పుడు మొత్తం రిజర్వ్ చేసిన టిక్కెట్లలో 86.38% ఆన్లైన్లో బుక్ అవుతున్నాయి.
వెబ్సైట్ 87% స్టాటిక్ కంటెంట్ ఇప్పుడు CDN (కంటెంట్ డెలివరీ నెట్వర్క్) ద్వారా అందిస్తుంది.చబడుతుంది. ఇది వెబ్సైట్ను వేగంగా లోడ్ చేస్తుంది. అలాగే సర్వర్పై లోడ్ను తగ్గిస్తుంది. AI- ఆధారిత వ్యవస్థ చురుకుగా బాట్ ట్రాఫిక్ను గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తుంది. అనుమానాస్పద వినియోగదారులను గుర్తించి నిష్క్రియం చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా…? ఇలా చెక్ చేసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




