AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: భారత రైల్వే రైలు ఇంజిన్‌, కోచ్‌ల తయారీకి ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆసక్తికర విషయాలు

రైలు ప్రయాణం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 15 వేల రైళ్లు నడుస్తున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికీ ఈ ప్రయత్నంలో నిమగ్నమై ప్రయాణికులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. భారతదేశంలోని ప్రతి నగరం నుంచి..

Indian Railways: భారత రైల్వే రైలు ఇంజిన్‌, కోచ్‌ల తయారీకి ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆసక్తికర విషయాలు
Indian Railways
Subhash Goud
|

Updated on: Jun 18, 2023 | 9:44 PM

Share

రైలు ప్రయాణం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 15 వేల రైళ్లు నడుస్తున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికీ ఈ ప్రయత్నంలో నిమగ్నమై ప్రయాణికులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. భారతదేశంలోని ప్రతి నగరం నుంచి గ్రామాలకు రైల్వేల కనెక్టివిటీని చేయవచ్చు. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. అయితే రైల్వే ఒక రైలులు తయారు చేసేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుంది. ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

రైలు తయారీకి ఎంత ఖర్చు

రైల్లో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌ల వంటి బోగీలు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. ఇది కాకుండా ప్యాంట్రీ కార్లు, గార్డు గదులు కూడా ఇందులో అమర్చబడి ఉంటాయి. జనరల్ కోచ్ గురించి చెప్పాలంటే.. జనరల్ కోచ్‌ను తయారు చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక స్వీపర్‌ కోచ్‌ను తయారు చేసేందుకు దాదాపు రూ.1.5 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు రైల్వే శాఖ ద్వారా సమాచారం.

అదే సమయంలో అటువంటి కోచ్‌ను సిద్ధం చేయడానికి రైల్వేకు రూ.2 కోట్లు ఖర్చవుతుంది. ఇది కాకుండా ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేయాలంటే 18 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది రైల్వే. దీని ప్రకారం 24 బోగీలతో పూర్తిస్థాయి రైలును సిద్ధం చేసేందుకు రైల్వేశాఖ దాదాపు 60 నుంచి 70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వేర్వేరు రైళ్లకు వేర్వేరు ఖర్చులు:

ఒక్కో రైలును సిద్ధం చేయడానికి రైల్వేలు ఒకే మొత్తాన్ని ఖర్చు చేయనవసరం లేదని, కానీ భారతీయ రైల్వేలు వేర్వేరు రైళ్లను తయారు చేయడంలో వేర్వేరుగా ఖర్చు చేయాల్సి ఉంటుందని రైల్వే చెబుతోంది. ఇక్కడ రైళ్ల ధరను ఇంజన్‌తో సహా చెబుతున్నారు.

  • సాధారణ MEMU 20-కోచ్ రైలు ధర 30 కోట్ల రూపాయలు.
  • మెయిల్ ఐసీఎఫ్ తరహా రైలును 25 బోగీలతో తయారు చేసేందుకు రూ.40.3 కోట్లు ఖర్చవుతుంది.
  • 21 కోచ్‌లతో కూడిన హౌరా రాజధాని ఎల్‌హెచ్‌బీ తరహా రైలు ధర రూ.61.5 కోట్లు.
  • 19 బోగీలతో కూడిన అమృత్‌సర్ శతాబ్ది ఎల్‌హెచ్‌బి తరహా రైలు నిర్మాణానికి రూ.60 కోట్లు ఖర్చవుతుంది.

వందేభారత్:

రైల్వే ఖర్చు ఒక సాధారణ రోల్ రైలును తయారు చేయడానికి గరిష్టంగా రూ. 60 నుండి 70 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో భారతదేశంలో నడుస్తున్న కొత్త రైలు ‘వందే భారత్ ట్రైన్’ తయారీకి కేవలం 13 రూట్లలో నడిపేందుకు దాదాపు రూ.110 నుంచి 120 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి