Indian Economy 2025: ఊపందుకున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగ వృద్ధి వేగవంతం!
Indian Economy 2025: 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన ఉపాధి వృద్ధికి సంబంధించిన ప్రశ్నపై, దాదాపు 97 శాతం కంపెనీలు ఉపాధిని పెంచుతాయని భావిస్తున్నట్లు సూచించాయి. 42 నుంచి 46 శాతం సంస్థలు ఉపాధిలో 10 నుంచి 20 శాతం పెరుగుదలను సూచించాయి. 31 శాతం నుంచి 36 శాతం మంది ఉద్యోగాలు 10 శాతం పెరిగే అవకాశం..

CII Survey: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన ఒక సర్వే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివరాలనున వెల్లడించింది. సర్వే నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక వాతావరణం ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని 75% కంపెనీలు భావిస్తున్నాయి. భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, అంతరాయం కలిగించిన సరఫరాల ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్టుబడుల పట్ల ఈ సానుకూల సెంటిమెంట్ అలాగే ఉంది.
సర్వేలో పాల్గొన్న 70 శాతం కంపెనీలు FY26లో పెట్టుబడులు పెట్టనున్నాయని, అందుకే రాబోయే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి, వేతన ధోరణులలో వృద్ధిని అంచనా వేయడానికి CII పరిశ్రమ సర్వేను ప్రారంభించింది. ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కూడా ఇటీవలి విధాన చర్చలలో కేంద్రంగా ఉంది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని దాదాపు 97 శాతం సంస్థలు భావిస్తున్నాయని సర్వే ప్రాథమిక ఫలితాలు చూపిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న 79% కంపెనీలు గత మూడేళ్లలో తమ శ్రామిక శక్తిని పెంచుకున్నట్లు తెలిపాయి.
ఉద్యోగాలు చాలా పెరుగుతాయి:
2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన ఉపాధి వృద్ధికి సంబంధించిన ప్రశ్నపై, దాదాపు 97 శాతం కంపెనీలు ఉపాధిని పెంచుతాయని భావిస్తున్నట్లు సూచించాయి. 42 నుంచి 46 శాతం సంస్థలు ఉపాధిలో 10 నుంచి 20 శాతం పెరుగుదలను సూచించాయి. 31 శాతం నుంచి 36 శాతం మంది ఉద్యోగాలు 10 శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఈ రెండు రంగాల్లో వృద్ధి
CII యొక్క సర్వే నివేదిక ప్రకారం, వచ్చే ఏడాది తయారీ మరియు సేవా రంగాలలో ప్రత్యక్ష ఉపాధి వృద్ధి 15 నుండి 22% ఉండవచ్చు. అయితే పరోక్ష ఉపాధి వృద్ధి 14% ఉండవచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీలో సవాళ్లను కూడా సర్వే వెల్లడించింది. సీనియర్ మేనేజ్మెంట్ స్థానాలను భర్తీ చేయడానికి 1 నుండి 6 నెలల మధ్య సమయం పడుతుందని సర్వే చేసిన చాలా సంస్థలు నివేదించాయి. అయితే రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులకు ఖాళీలను భర్తీ చేయడానికి తక్కువ సమయం అవసరం.
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం ఉద్యోగాల కల్పనపై ఆధారపడి ఉందని CII తెలిపింది. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ భౌగోళిక-రాజకీయ సవాళ్ల మధ్య భారతదేశం ‘బ్రైట్ స్పాట్’గా ఆవిర్భవించిందని అన్నారు. వృద్ధిని నడిపించే రెండు ముఖ్యమైన అంశాలు – ప్రైవేట్ పెట్టుబడులు, ఉపాధి సానుకూలంగా కనిపిస్తున్నాయన్నారు. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం వృద్ధి రేటు 6.4 నుండి 6.7 శాతం, 2026 ఆర్థిక సంవత్సరంలో 7.0 శాతంగా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు.
2024 ఆర్థిక సంవత్సరంలో సీనియర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్, సూపర్వైజరీ స్థాయి, సాధారణ కార్మికుల సగటు జీతం 10 నుండి 20 శాతం పెరిగిందని, 2025లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని సర్వేలో పాల్గొన్న 40 నుండి 45% కంపెనీలు నివేదించాయి. జీతాలు పెరగడం వల్ల ప్రైవేట్ వినియోగం పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదని సర్వే నివేదిక చెబుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




