AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ రైలు సేవలు.. లోక్‌సభలో రైల్వే మంత్రి కీలక విషయాలు

Indian Railways: భారతీయ రైల్వేలు మునుపటి కంటే రైల్వేలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిర్ణీత సమయానికి రైళ్లను నడపడం, ప్రయాణ సమయంలో కోచ్‌లో పరిశుభ్రత, ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణ సహాయం..

Indian Railways: రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ రైలు సేవలు.. లోక్‌సభలో రైల్వే మంత్రి కీలక విషయాలు
Subhash Goud
|

Updated on: Nov 29, 2024 | 11:17 AM

Share

వందే భారత్ రైలు సర్వీసులు ప్రయాణికులకు మెరుగైన భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో పనిచేస్తున్నాయని, అలాగే నవంబర్ 21వ తేదీ వరకు 136 వందే భారత్ రైలు సేవలు అందుతున్నాయని ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం రాతపూర్వక సమాధానంలో పలు విషయాలను సభకు వెల్లడించారు. ఈ భద్రతా ఫీచర్లు, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవాచ్, వేగవంతమైన పనితీరు, పూర్తిగా సీల్డ్ గ్యాంగ్‌వే, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మెరుగైన రైడ్ సౌకర్యం, హాట్ కేస్‌తో కూడిన మినీ ప్యాంట్రీ, బాటిల్ కూలర్, డీప్ ఫ్రీజర్, హాట్ వాటర్ బాయిలర్ వంటి సదుపాయాలతో వందేభారత్‌ రైళ్లు రన్‌ అవుతున్నాయని అన్నారు. మహారాష్ట్రతో పాటు న్యూఢిల్లీ-కత్‌గోడం మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు చెప్పారు.

భారతీయ రైల్వేలు మునుపటి కంటే రైల్వేలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిర్ణీత సమయానికి రైళ్లను నడపడం, ప్రయాణ సమయంలో కోచ్‌లో పరిశుభ్రత, ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణ సహాయం అందించడం వంటి విషయాలపై పని నిరంతరంగా కొనసాగుతోందన్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో తేజస్, వందే భారత్ వంటి రైళ్లను చేర్చడంతో ప్రయాణికుల ప్రయాణ అనుభవంలో చాలా మార్పు వచ్చిందన్నారు.

ఎంపీల ప్రశ్నలకు అశ్విని వైష్ణ సమాధానమిస్తూ, ఢిల్లీ-కత్‌గోడం సెక్టార్‌లో మూడు జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్ సేవలు అందుతున్నాయని, ఇందులో 12039/40 కత్‌గోడం-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

రైల్‌మదాద్ పోర్టల్‌లోని రైల్ అనుభవం ద్వారా రైల్వేలు అందించే సేవలపై రైల్వే ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 03 జూలై 2024 నుండి 20 నవంబర్‌ 2024 మధ్య కాలంలో మొత్తం 51,346 వందేభారత్ రైళ్లపై ఫీడ్‌బ్యాక్ సే రైల్ అనుభవ్ ద్వారా స్వీకరించినట్లు మంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి