Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Jan Aushadhi Kendra: జనరిక్‌ ఔషధ కేంద్రాలపై కేంద్రం కీలక నిర్ణయం.. తక్కువ ధరలకే మందులు

మోదీ ప్రభుత్వం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశంలో 2017లో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభించింది. 2017. పూర్తయింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా..

PM Jan Aushadhi Kendra: జనరిక్‌ ఔషధ కేంద్రాలపై కేంద్రం కీలక నిర్ణయం.. తక్కువ ధరలకే మందులు
Pm Jan Aushadhi Kendra
Follow us
Subhash Goud

|

Updated on: Jan 02, 2023 | 6:00 AM

మోదీ ప్రభుత్వం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశంలో 2017లో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభించింది. 2017. పూర్తయింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో 743 జిల్లాలను కలుపుకుని 10,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించబోతున్నారు. దీని ప్రారంభంతో అతి త్వరలో సామాన్యులు దేశంలోని ప్రతి మూలకు చౌకగా మందులను పొందుతారు.

భారతీయ జన్ ఔషధి కేంద్రంలో జెనరిక్ ఔషధాలను విక్రయిస్తారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే వీటి ధర 50 నుంచి 90 శాతం తక్కువ. మార్చి 2024 నాటికి ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో నాణ్యమైన మందులు సరసమైన ధరలకు లభిస్తాయి.

రూ.18,000 కోట్లు ఆదా:

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల ద్వారా గత 8 ఏళ్లలో దాదాపు రూ.18,000 కోట్లు ఆదా అయ్యాయి. దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో 743 జిల్లాలను కవర్ చేస్తూ ప్రభుత్వం 10,000 కంటే ఎక్కువ ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాలను భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం నవంబర్ 2008లో ప్రారంభించింది. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు డిసెంబర్ 2017లో 3,000 కేంద్రాలను ప్రారంభించాలనే లక్ష్యాన్ని సాధించాయి. మార్చి 2020లో ఈ కేంద్రాల సంఖ్య 6,000కి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 8,610గా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 10,000కు చేరుకోనుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ కేంద్రాల్లో 1,759 మందులు, 280 శస్త్ర చికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయి. మార్చి 2024 నాటికి ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూ. 893.56 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాలు విక్రయించబడ్డాయి. ఈ విధంగా బ్రాండెడ్ మందులతో పోలిస్తే దేశప్రజలకు రూ.5,300 కోట్లు ఆదా అయ్యేలా చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి