AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు.!!

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు జరగనున్నాయని తెలుస్తోంది...

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు.!!
Ravi Kiran
|

Updated on: Feb 16, 2021 | 8:24 PM

Share

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఐటీ రంగంలోని సుమారు 95 శాతం సీఈఓలు పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు నాస్కామ్(NASSCOM) సర్వే వెల్లడించింది. అలాగే 67% మంది సీఈఓలు ఆర్ధిక సంవత్సరం 2020తో పోలిస్తే 2021 ఆర్ధిక సంవత్సరంలో ఐటీ రంగం మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

2020-21 (ఎఫ్‌వై 21) ఆర్థిక సంవత్సరంలో సమాచార సేవల రంగం ఆదాయ వృద్ధిని 2.3 శాతంగా నాస్కామ్(NASSCOM) అంచనా వేసింది. అలాగే ఐటీ కంపెనీల ఆదాయం ఎఫ్‌వై 21లో 194 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అటు 2020-21 ఆర్ధిక సంవత్సరం రెండో భాగంలో టాప్ ఇండియన్ ఐటీ కంపెనీలు మెరుగైన పనితీరును కనబరిచినట్లు సర్వే పేర్కొంది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవడంతో పాటు డిజిటల్ పద్దతులను వేగవంతం చేయడంతో కరోనా కాలంలో ఈ వృద్ది సాధించగలిగినట్లు ఐటీ ఇండస్ట్రీ బాడీ ”న్యూ వరల్డ్: ది ఫ్యూచర్ ఈజ్ వర్చువల్” పేరుతో వచ్చిన స్ట్రాటజిక్ రివ్యూ 2021లో పేర్కొంది. డిజిటల్ పద్ధతులకు కంపెనీలు వెచ్చించిన ఖర్చు ద్వారా ఐటీ రంగం వృద్ది సాధించడానికి దోహదపడింది. దాదాపు 28 నుంచి 30 శాతం డిజిటల్ ఖర్చుల ద్వారానే ఐటీ రంగానికి రెవెన్యూ వచ్చింది.

కరోనా ఉన్నప్పటికీ ఐటీ రంగం 8 శాతం సాపేక్ష వాటాను జాతీయ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌కు అందించింది. అలాగే 52% సాపేక్ష వాటాను సేవా ఎగుమతుల్లో, అటు 50 శాతం విదేశీ పెట్టుబడుల్లో 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు పెట్టింది. ఐటిలో ఆదాయ వృద్ధి ప్రధానంగా ఈ-కామర్స్ నుండి వచ్చింది, దాదాపు 4.8 శాతం పెరిగి 57 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత హార్డ్‌వేర్ విభాగంలో 4.1 శాతం వృద్ధి లభించింది. ఇక అది సంవత్సరానికి 16 బిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది.

కాగా, ఇతర కంపెనీలు అనేక మంది ఉద్యోగులను స్కోర్ల ద్వారా తొలిగించినప్పటికీ.. ఐటీ కంపెనీలు కొత్త రిక్రూటర్లను తీసుకున్నాయి. అలాగే 2021 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 1,38,000 నియామకాలు జరిగాయి. ఇక 2021 చివరి నాటికి దాదాపు 4.47 మిలియన్ మందికి ఉపాధి దొరకనుందని అంచనా.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!

ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
లక్ష్మీదేవి ఆశీస్సులు.. ఈ వేళల్లో కర్పూరం వెలిగిస్తే ఎన్ని లాభాలో
లక్ష్మీదేవి ఆశీస్సులు.. ఈ వేళల్లో కర్పూరం వెలిగిస్తే ఎన్ని లాభాలో