Gold Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్నిరోజుల నుంచి మార్కెట్‌లో

Gold Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?
Follow us

|

Updated on: Mar 20, 2022 | 6:28 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్నిరోజుల నుంచి మార్కెట్‌లో (Bullion Market) బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆదివారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ.150, 24 క్యారెట్లపై రూ.170 మేర పెరిగింది. కాగా.. వెండి ధరలు కూడా రూ.1,000 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.68,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల ధర రూ.52,420 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.72,300 ఉంది. బెంగళూరులో రూ.72,300, కేరళలో రూ.72,300 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300, విజయవాడలో రూ.72,300, విశాఖపట్నంలో రూ.72,300 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ

Rahul Gandhi: ద్వేషం, కోపం రంగాల్లోనూ భారతదేశానికి త్వరలోనే అగ్రస్థానం.. కేంద్రంపై రాహుల్ వంగ్యాస్త్రాలు!