
బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజుల వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం (అక్టోబర్14) మాత్రం స్థిరంగా కొనసాగాయి. నిన్నటి (అక్టోబర్ 13) తో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 54,000 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.72, 600 పలుకుతోంది. మరి శనివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 72,600 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు అమలవుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 72,600, ముంబైలో 72,600, బెంగళూరులో రూ. 71,500, కోల్కతా రూ. 72,600, చెన్నైలో 77,000లకు కిలో వెండి లభిస్తోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..