AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: మోడీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్స్‌ అందిస్తుందా? ఇందులో నిజమెంత?

Fact Check: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తుందని సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ వెబ్‌సైట్ లింక్‌ కూడా వైరల్‌ అవుతోంది. విద్యార్థులు ఉచిత ల్యాప్‌టాప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈ వైరల్ అవుతున్న పోస్ట్‌ సారాంశం. మోడీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తుందా?

Fact Check: మోడీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్స్‌ అందిస్తుందా? ఇందులో నిజమెంత?
Subhash Goud
|

Updated on: Mar 30, 2025 | 5:56 PM

Share

మోడీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోందని చెప్పే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, ఈ వాదనలు పూర్తిగా నిజం కాదు. భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్’ పేరుతో ఏ విధమైన అధికారిక పథకాన్ని ప్రకటించలేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం గతంలో ఇలాంటి వాదనలను తప్పుడు సమాచారంగా గుర్తించి ప్రభుత్వం అటువంటి స్కీమ్‌ను నడుపుతోందని చెప్పే లింక్‌లు లేదా పోస్ట్‌లు నకిలీవని స్పష్టం చేసింది. అలాగే, AICTE కూడా ఇటువంటి వార్తలను ఖండిస్తూ విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని కోరింది.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు (ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ లేదా తమిళనాడు) తమ సొంత పథకాల కింద మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు లేదా టాబ్లెట్‌లు అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కానీ, ఇవి మోడీ ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చినవి కావు. అందువల్ల, “మోడీ ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది” అనే వాదన సాధారణంగా తప్పుదారి పట్టించేలా ఉంటుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేస్తోంది. అయితే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నకిలీ వెబ్‌సైట్లు వైరల్‌ అవుతున్నాయి. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే విద్యార్థికి సంబంధించి వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు నమోదు చేసినట్లయితే మోసాల్లో పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Free Laptop

ఉచిత ల్యాప్‌టాప్‌ ఇస్తున్నారనేది ఫేక్‌ న్యూస్‌ అంటూ గతంలో పీఐబీ (PIB)ట్వీట్‌

ప్రధానమంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం అనేది తప్పుడు సమాచారం అని, ఇలాంటివి తప్పుదారి పట్టించేవిగా ఉంటాయని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)తన నోటీసులో పేర్కొంది. ఇటువంటి సమాచారాన్ని నమ్మే ముందు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు (ఉదా. www.pib.gov.in లేదా www.aicte-india.org) లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా ధృవీకరించుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి
Fake Website

ఉచిత ల్యాప్‌టాప్‌ అంటూ ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఫేక్‌ వెబ్‌సైట్‌ ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లింక్‌లను క్లిక్‌ చేయవద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి