EPFO: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!

EPFO: ఈ కొత్త సేవ ప్రధాన లక్షణం ఏమిటంటే వినియోగదారులు తమ సొంత భాషలో సమాచారాన్ని పొందవచ్చు. ఇది అనేక భారతీయ భాషలలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ చాట్‌బాట్ ద్వారా కూడా పనిచేస్తుంది. ఈ ఏఐ..

EPFO: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు..!
Epfo

Updated on: May 23, 2026 | 8:04 PM

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలో తన కోట్లాది మంది వినియోగదారుల కోసం ఒక కొత్త డిజిటల్ సేవను ప్రారంభించనుంది. ఈ కొత్త సదుపాయంతో మీ పీఎఫ ఖాతా వివరాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం లేదా EPFO ​​కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించడం అవసరం లేదు. వాట్సాప్‌లో ‘హలో’ అని సందేశం పంపడం ద్వారా మీరు పీఎఫ్‌కి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. దీనివల్ల మీ పీఎఫ్‌ ఖాతాను యాక్సెస్ చేయడం గతంలో కంటే చాలా సులభం అవుతుంది.

వాట్సాప్‌లో పీఎఫ్‌ సేవ:

ఈపీఎఫ్‌వో త్వరలో దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడి వాట్సాప్ నంబర్‌ను ప్రారంభించనుంది. ఈ నంబర్‌కు ‘హలో’ అని పంపడం ద్వారా, వినియోగదారులకు వివిధ సేవలు కనిపిస్తాయి. ఉదాహరణకు వారు పీఎఫ్‌ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్, ఫిర్యాదుల స్టేటస్ మొదలైన సమాచారాన్ని తక్షణమే తెలుసుకోగలుగుతారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని మీకు తెలుసా..?

ఇవి కూడా చదవండి

ఈ కొత్త సేవ ప్రధాన లక్షణం ఏమిటంటే వినియోగదారులు తమ సొంత భాషలో సమాచారాన్ని పొందవచ్చు. ఇది అనేక భారతీయ భాషలలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ చాట్‌బాట్ ద్వారా కూడా పనిచేస్తుంది. ఈ ఏఐ చాట్‌బాట్ వారంలోని ప్రతిరోజూ, రోజుకు 24 గంటలు పనిచేస్తుంది. ఈ చాట్‌బాట్ ద్వారా మనం అడిగే అన్ని ప్రశ్నలకు తక్షణ సమాధానాలు పొందుతాము. మనం సాధారణ సందేహాలకు మాత్రమే కాకుండా, కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు పొందుతాము. మనకు సమాధానాలు లభించడమే కాకుండా తదుపరి ఏమి చేయాలో కూడా తెలియజేస్తుంది.

ఇది కూడా చదవండి: Car Driving Tips: డ్రైవింగ్ అంటే భయమా? ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!

ఈ కొత్త సౌకర్యం ప్రవేశపెట్టడం వల్ల ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈపీఎఫ్‌ఓ వద్ద పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us