AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఏ బ్యాంకు నుంచి అయినా డబ్బు తీసుకోవచ్చు!

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరట లభించనుంది. పదవీ విరమణ తర్వాత EPFO పెన్షన్ పథకం ఈపీఎస్‌ నుండి పెన్షన్ పొందడం సులభం అవుతుంది. ఈ మార్పు వచ్చే ఏడాది అంటే జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఆ తర్వాత ఏదైనా బ్యాంకు బ్రాంచ్ నుండి పెన్షన్ పొందడం సులభం అవుతుంది. ఈ కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత..

కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఏ బ్యాంకు నుంచి అయినా డబ్బు తీసుకోవచ్చు!
Subhash Goud
|

Updated on: Sep 05, 2024 | 10:00 AM

Share

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరట లభించనుంది. పదవీ విరమణ తర్వాత EPFO పెన్షన్ పథకం ఈపీఎస్‌ నుండి పెన్షన్ పొందడం సులభం అవుతుంది. ఈ మార్పు వచ్చే ఏడాది అంటే జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఆ తర్వాత ఏదైనా బ్యాంకు బ్రాంచ్ నుండి పెన్షన్ పొందడం సులభం అవుతుంది. ఈ కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS) నుండి ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) 1995కి సంబంధించిన ప్రతిపాదనను అందుకుంది. ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన ఏ బ్యాంకు శాఖ నుండి అయినా పింఛను విత్‌డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. జనవరి 1, 2025 నుండి భారతదేశంలోని ఏదైనా బ్యాంక్, బ్రాంచ్ లేదా ప్రదేశం నుండి తమ పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఇది EPS పెన్షనర్‌లకు సహాయపడుతుంది.

ఈ విధానంతో 78 లక్షల మందికి పైగా ప్రయోజనం:

ఈపీఎఫ్‌వోకు చెందిన 78 లక్షల మంది ఈపీఎస్‌ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఉన్నతమైన ఐటీ, బ్యాంకింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఇది పెన్షనర్లకు మరింత సమర్థవంతమైన, ఇబ్బందులు లేని, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఈపీఎఫ్‌వో ఆధునీకరణలో సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (సీపీపీఎస్) ఆమోదం ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా అన్నారు.దేశంలోని ఏ బ్యాంకు, ఏ శాఖ నుండి అయినా పెన్షనర్లు తమ పెన్షన్‌ను తీసుకునేందుకు వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది ఎలా పని చేస్తుంది?

ఈపీఎఫ్‌వో ప్రత్యక్ష ప్రాంతీయ/జోనల్ కార్యాలయం కేవలం 3-4 బ్యాంకులతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ విధానంతో పింఛను ప్రారంభించే సమయంలో పింఛనుదారులు ఏ వెరిఫికేషన్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పింఛను విడుదలైన వెంటనే ఖాతాలో డబ్బులు జమ కానుంది. ఇది కాకుండా, కొత్త వ్యవస్థకు మారిన తర్వాత పెన్షన్ పంపిణీ ఖర్చు కూడా తగ్గుతుందని ఈపీఎఫ్‌వో ​​భావిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి