AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Mallya : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వాటాలను అమ్మి 792 కోట్లను ఎస్బీఐ కన్సార్టియంకు అప్పచెప్పిన ఈడీ!

Vijay Mallya : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, విజయ్ మాల్యా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాటాలను విక్రయించడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని కన్సార్టియం రూ .792.11 కోట్లు సమీకరించింది. 

Vijay Mallya : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వాటాలను అమ్మి 792 కోట్లను ఎస్బీఐ కన్సార్టియంకు అప్పచెప్పిన ఈడీ!
Vijay Mallya
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 17, 2021 | 3:03 PM

Share

Vijay Mallya : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, విజయ్ మాల్యా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాటాలను విక్రయించడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని కన్సార్టియం రూ .792.11 కోట్లు సమీకరించింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ విషయాన్ని తెలిపింది. ఈ వాటాలను ఈడీ కన్సార్టియానికి అప్పగించింది. ఇంతకుముందు ఇదే కన్సార్టియం ఈడీ నుంచి అందుకున్న ఆస్తులను అమ్మడం ద్వారా రూ .7,181.50 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా నీరవ్ మోడీ కేసులో రూ .1,060 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడానికి ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరాలు (ఎఫ్‌ఈఓ) కోర్టు బ్యాంకులను అనుమతించింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ అపరాధుల చట్టం నిబంధనల ప్రకారం రూ .329.67 కోట్లు కూడా స్వాధీనం చేసుకుంది.

జూలై 1 న నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ తన విదేశీ బ్యాంకు ఖాతా నుంచి రూ .17.25 కోట్ల విలువైన డబ్బును  ఈడీకి బదిలీ చేశారు. ఎస్‌బిఐ నేతృత్వంలోని కన్సార్టియానికి మొత్తం రూ .3,728.64 కోట్లు ఈడీ అందజేసింది. ఇందులో రూ .3,644.74 కోట్ల విలువైన షేర్లు, రూ. 54.33 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్, రూ .59.57 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

ఈడీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ‘విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ ప్రభుత్వ రంగ బ్యాంకులతో మోసాలకు పాల్పడ్డారు. వీరంతా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తమ కంపెనీల ద్వారా తప్పుడు విధానాల్లో మళ్లించారు. బ్యాంకులకు మొత్తం రూ .22,585 కోట్లు నష్టం వాటిల్లింది. ఇడి ఇప్పటివరకు రూ .12,762.25 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేసింది. అదేవిధంగా, రూ .329.67 కోట్ల విలువైన అటాచ్డ్ ఆస్తులను బ్యాంకులకు అప్పచెప్పింది.

ఇప్పటివరకూ 58 శాతం రికవరీ..

ఇప్పటివరకు, ముగ్గురు పారిపోయిన  నిందితుల నుంచి  బ్యాంకులకు జరిగిన నష్టాలలో 58% వరకు వారికి అప్పగించారు లేదా జప్తు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. పిఎమ్‌ఎల్‌ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) నిబంధన ప్రకారం రూ .18,217.27 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్ గురించి ఇడి సమాచారం ఇచ్చింది.

Also Read: RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఆ ఏటీఎమ్‌లకే ఎందుకు వెళ్లాలంటే.. ఎస్‌బీఐలో ఉచితంగా అందిస్తోన్న సేవలు తెలుపుతూ.