AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Price Increase: ధరల మోత..బట్ట కట్టడమూ కష్టమే కావచ్చు..దుస్తుల రెట్లు భారీగా పెరిగే అవకాశం.. ఎందుకంటే..

సరకు రవాణా ధరలు గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోయాయి. కానీ అధిక ఇన్‌పుట్ ఖర్చు కారణంగా, రాబోయే నెలల్లో బట్టల నుంచి మొబైల్ ఫోన్లు అలాగే టీవీల వరకు ఖరీదైనవిగా మారిపోయే ఛాన్స్ ఉంది.

Price Increase: ధరల మోత..బట్ట కట్టడమూ కష్టమే కావచ్చు..దుస్తుల రెట్లు భారీగా పెరిగే అవకాశం.. ఎందుకంటే..
Increasing Cloths Rates
KVD Varma
|

Updated on: Nov 23, 2021 | 4:52 PM

Share

Price Increase: సరకు రవాణా ధరలు గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోయాయి. కానీ అధిక ఇన్‌పుట్ ఖర్చు కారణంగా, రాబోయే నెలల్లో బట్టల నుంచి మొబైల్ ఫోన్లు అలాగే టీవీల వరకు ఖరీదైనవిగా మారిపోయే ఛాన్స్ ఉంది.

ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయి..

నిజానికి ముడిసరుకు ధరలు పెరగడం, ఇన్‌పుట్‌ ఖర్చు పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఇప్పుడు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల నాటికి టెలివిజన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు 5 నుంచి 6% వరకు పెరిగే అవకాశం ఉంది. దీని తరువాత, జనవరి లేదా ఫిబ్రవరి నుంచి వాటి ధరలు మళ్లీ 10-12% పెరగవచ్చు.

పెద్ద బ్రాండ్‌లతో బేరసారాలు

దుస్తులు ఎగుమతిదారులు అధిక ధరను అధిగమించడానికి పెద్ద బ్రాండ్‌లతో రేట్లను మళ్లీ చర్చిస్తున్నారు. భారతదేశంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి.. సరఫరా ప్రభావితమైంది. అంతేకాకుండా పంట నష్టం కూడా వాటిల్లింది. దీంతో బాస్మతి బియ్యం తదితర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఆగస్ట్‌లో భారతదేశానికి లేదా అక్కడి నుండి కంటైనర్ ఛార్జీలు10,000-12,000 డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇవి 5 నుంచి 12 శాతం పెరిగాయి.

జనవరిలో కంటైనర్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయి

అయితే, జనవరిలో, కంటైనర్ ధర 3,000-4,000 డాలర్లు మాత్రమే. ఎగుమతిదారులు ధరలలో తగ్గుదల అలాగే, కంటైనర్ లభ్యతలో మెరుగుదలని ఆశిస్తున్నారు. ఇది భారతదేశ ఎగుమతులను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అక్టోబర్‌లో ఎగుమతులు 43% వృద్ధి చెంది 35.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశంలో మహమ్మారి మూడవ వేవ్ గురించి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నప్పుడు, సంవత్సరం ప్రారంభంలో ధరలను తిరిగి చర్చించడం ఎగుమతిదారులకు కష్టమైంది. అయితే, ఇప్పుడు కోవిడ్ చాలా వరకు అదుపులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయడం ప్రారంభమైంది.

నూలు ధరలు భారీగా పెరిగాయి

అయితే, వస్త్ర పరిశ్రమను కలవరపెడుతున్నది నూలు ధరల పెరుగుదల. గత ఏడాది కాలంలో ఇది 60% పైగా పెరిగింది. దీంతో ఉత్పత్తి ధర పెరుగుతుంది. కంటెయినర్లు నిల్వలు కూడా అయిపోయాయని ఇది కూడా ధరలపై ప్రభావం చూపిస్తుందనీ వ్యాపారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి