AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్లల్లో నీటి సమస్యకు చెక్.. సరికొత్త వ్యవస్థతో ప్రయాణికుల కష్టాలకు చెల్లు

భారతదేశంలో చౌకైన ప్రయాణం అంటే రైలు ప్రయాణమని టక్కున చెబుతారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లడానికి సామన్య ప్రజలు రైలునే ఆశ్రయిస్తారు. అయితే రైలు ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రయాణమే ముఖ్యమనే తలంపుతో చాలా మంది ఉంటారు. అయితే కొన్ని రైళ్లల్లో అయితే నీటి కష్టాలు ప్రయాణికులను వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అత్యవసరంగా వాష్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు నీరు రాకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

Indian Railways: రైళ్లల్లో నీటి సమస్యకు చెక్.. సరికొత్త వ్యవస్థతో ప్రయాణికుల కష్టాలకు చెల్లు
Train
Nikhil
|

Updated on: Aug 21, 2024 | 7:00 AM

Share

భారతదేశంలో చౌకైన ప్రయాణం అంటే రైలు ప్రయాణమని టక్కున చెబుతారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లడానికి సామన్య ప్రజలు రైలునే ఆశ్రయిస్తారు. అయితే రైలు ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రయాణమే ముఖ్యమనే తలంపుతో చాలా మంది ఉంటారు. అయితే కొన్ని రైళ్లల్లో అయితే నీటి కష్టాలు ప్రయాణికులను వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అత్యవసరంగా వాష్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు నీరు రాకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా రైలు ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో భారతీయ రైల్వే వినూత్న ‘నీటి స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ’ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నీటి ఇబ్బందులను తీర్చేలా భారతీయ రైల్వేలు తీసుకొచ్చిన సరికొత్త విధానం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

నీటి స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ ట్రయల్ రన్‌ను బ్రహ్మపుత్ర మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో నిర్వహించారు. సుదూర రైళ్లకు నీటి నిర్వహణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ అనేది కామాఖ్య రైల్వే స్టేషన్‌లోని బ్రహ్మపుత్ర మెయిల్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ఒక ర్యాక్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసిన రియల్ టైమ్ నీటి పర్యవేక్షణ వ్యవస్థ. ఈ సిస్టమ్ రైలులోని నీటి ట్యాంకుల్లో నీటి స్థాయిలను నిరంతర, కచ్చితమైన పర్యవేక్షణను అందిస్తుంది. ఇది ఎల్ఓఆర్ఏ, జీపీఆర్ఎస్ ఆధారిత కమ్యూనికేషన్‌ను ఉపయోగించుకుంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రత్యేకంగా అనుకూలమైన డేటాను సుదూర, తక్కువ-శక్తి వైర్‌లెస్ ప్రసారాన్ని అనుమతిస్తుంది. ఈ సిస్టమ్ ప్రోగ్రామబుల్ రియల్-టైమ్ డేటా లాగింగ్, స్టోరేజ్‌ను కలిగి ఉంది

ముఖ్యంగా రియల్ టైమ్ నీటి పర్యవేక్షణ వ్యవస్థ డేటా క్యాప్చర్, హైడ్రోస్టాటిక్ ప్రెజర్ సెన్సార్ ద్వారా ప్రసారం అవుతుంది. ఇది ఒక మీటరు నుంచి 5 మీటర్ల పరిధిలో 0.5 శాతం కచ్చితత్వంతో నీటి స్థాయిలను కొలుస్తుంది. డేటా లాగింగ్‌ను కచ్చితమైన సమయ స్టాంపులతో సమకాలీకరించడానికి సిస్టమ్ అంతర్నిర్మిత రియల్ టైమ్ గడియారాన్ని కూడా కలిగి ఉంటుంది. తద్వారా కచ్చితమైన డేటా విశ్లేషణలో సహాయపడుతుంది. అలాగే సమర్థవంతమైన నీటి నిర్వహణను నిర్ధారిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్‌కు విజయవంతమైతే  ఇతర రైళ్లలో ఈ సిస్టమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న కామాఖ్య  రైల్వే స్టేషన్‌లో ఎన్ఎఫ్ఆర్ జనరల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..