AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024 Speech: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాంః ఆర్థిక మంత్రి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వ రెండో పర్యాయం చివరి బడ్జెట్‌ను సమర్పించారు. పార్లమెంటులో తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను ప్రస్తావించారు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్' అనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజన్ గురించి వివరించారు. గత 10 సంవత్సరాలుగా పరివర్తన కాలం వచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తోందని అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Budget 2024 Speech: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాంః ఆర్థిక మంత్రి
Finance Minister Nirmala Sitharaman
Balaraju Goud
|

Updated on: Feb 01, 2024 | 11:38 AM

Share

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వ రెండో పర్యాయం చివరి బడ్జెట్‌ను సమర్పించారు. పార్లమెంటులో తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను ప్రస్తావించారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజన్ గురించి వివరించారు. గత 10 సంవత్సరాలుగా పరివర్తన కాలం వచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తోందని అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి, ఉపాధి పొందేందుకు వీలుగా ప్రజల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. సమ్మిళిత అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టి సారించి, అన్ని వర్గాలకు, ప్రజలందరికీ అభివృద్ధి అనే చర్చ జరుగుతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామన్నారు ఆర్థిక మంత్రి.

25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించింది. పేదలు, మహిళలు, యువత, రైతుల సాధికారతపై మోదీ సర్కార్ దృష్టి పెడుతోందన్నారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. 78 లక్షల మంది విక్రేతలకు పీఎం స్వానిధి పథకం కింద సహాయం అందించడం జరిగిందన్నారు. జన్ ధన్ ద్వారా నేరుగా రూ.34 లక్షల కోట్ల నగదు బదిలీ అయిందన్నారు నిర్మలా సీతారామన్.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11.8 కోట్ల మంది రైతులకు ప్రభుత్వ సహాయం అందించామని, కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని అన్నదాత ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ యోజన ప్రయోజనం 4 కోట్ల మంది రైతులకు అందించడం జరుగుతుంది. 300 యూనివర్శిటీలు స్థాపించి మూడో వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దేశ ప్రజలు భవిష్యత్తు వైపు చూస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ సర్కార్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆహార ధాన్యాల సమస్యలను పరిష్కరించామని, 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రాథమిక అవసరాలు నెరవేరాయి. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగింది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది, ప్రజలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

ఈ బడ్జెట్ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుందని, ఆశ్రిత పక్షపాతాన్ని కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యువతపై దేశానికి అపారమైన నమ్మకం ఉంది. క్రీడల్లో యువత పాల్గొన్నారు. 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందన్నారు. మా ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పనులు చేసింది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని రుజువైందన్నారు. జీడీపీపై మా ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తోందని సీతారామన్ అన్నారు. సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉంది. ప్రజల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రాల అభివృద్ధికి మా ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించనున్నారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మరిన్ని బడ్జెట్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us