AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: దేశంలో ఏర్పడిన గందరగోళం నుంచి బయటపడే మార్గాలేవి..? ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి?

Budget 2022: ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు..

Budget 2022: దేశంలో ఏర్పడిన గందరగోళం నుంచి బయటపడే మార్గాలేవి..? ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి?
Subhash Goud
|

Updated on: Feb 01, 2022 | 10:47 AM

Share

Budget 2022: ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు ఉంటాయోనని అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే 2022-23 గానూ దేశ వార్షిక బడ్జెట్‌ నిర్మించడంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాల్‌తో కూడుకున్నది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బడ్జెట్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్‌ విషయంలో ఆమె ఎంతో బాధ్యత తీసుకుని బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల కష్టాలు, పేద పారిశ్రామక సామర్థ్య వినియోగం, నికర ఆస్తులు, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, ఆదాయ అసమానతలను తీవ్రతరం చేయడం మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి.

ఇక కరోనా మహమ్మారి వల్ల తీవ్ర నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యం, విద్య, ఇతర అంశాలలో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈ బడ్జెట్‌ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని రెట్టింపు చేయాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌-ఖేరీలో రైతులు చేసిన పోరాటానికి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పడాల్సిన వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు తీవ్రంగా కొనసాగాయి. రైతుల ఆందోళనకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో గరిష్ట స్థాయిలో బడ్జెట్‌ను సమర్పించనప్పటికీ, ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇది బీజేపీకి చర్చనీయాంశంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలా చేయడం రాజకీయంగా అనైతికం. ఇది నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది.

వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగులు, రవాణా, పంపిణీ కోసం లాజిస్టికల్ మద్దతులు, వరదలు, వాతావరణంలో మార్పుల విపత్తులు ఉంటే కనీస అంతరాయం ఖర్చులను నిర్ధారించడం వంటి వాటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఈ బడ్జెట్లో లోటు పూడ్చాల్సి ఉంటుంది. గడిచిన ఏడాదిలో జరిగిన ఆందోళనలు, అల్లర్లు, నష్టాల నుంచి ఈ బడ్జెట్‌లో గట్టెక్కించాల్సిన అవసరం ఉంది. భారత జనాభాలో 70 శాతం మందిని దృష్టిలో ఉంచుకునే గ్రామీణ ప్రాంతాలలో నివసించే స్థిరమైన నమూనాను కలిగి ఉండలేకపోవడమే. వ్యవసాయ రుణాల మాఫీకి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

మార్చి 2020లో కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత భారతదేశంలో ఎక్కువగా నష్టాలు సంభవించాయి. సామాన్యుడి నుంచి వ్యాపార వేత్తల వరకు తీవ్రంగా నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ అమలు ఆర్థిక విధిని మరింతగా దిగజార్చిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దేశమంతటా కరోనా వైరస్‌ వ్యాపించడంతో భారతదేశం జీడీపీ 7.3 శాతానికి పడిపోయిన సందర్భంగా మళ్లీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభమైంది.

ఇక క్రెడిట్‌ గ్యారెంటీలు, మృదువైన రుణాలు, తక్కువ పూచీకత్తులు, సులభంగా చెల్లించడం భారతదేశం ఆర్థిక లోటును అదుపులో ఉంచినప్పటికీ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పంప్‌-ప్రైమింగ్‌ లేకపోవడానికి దారి తీసింది. అలాగే పెట్టుబడులను సృష్టించేందుకు ప్రధాన వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ వ్యయం కూడా మూలధన వ్యయం కూడా మూలధన వ్యయంపై లక్ష్యం కంటే తక్కువగా ఉంది.

2014లో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి భారతదేశ స్థూల స్థిర మూలధనం GDPలో 30 శాతం కంటే తక్కువగానే ఉంది. ప్రైవేట్ పెట్టుబడులు టార్పోర్‌లో మిగిలిపోవడంతో, ఉద్యోగాల కల్పన భారీ స్థాయిలో దెబ్బతింది. MBAలు, డాక్టర్లు, ఇంజనీర్లు, PhDలు మొదలైన వారు ప్రభుత్వ రంగంలోని జూనియర్ క్లర్క్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

దేశంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ మొదలైపోయింది. దేశంలో ప్రతి రోజు మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కరోనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ ముంచుకోస్తుండటంతో మరింత ఆందోళన నెలకొంది. ఇన్ని గందరగోళాలు జరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.

అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ లో పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. కరోనాతో అస్తవ్యస్తంగా మారిపోయిన ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Budget 2022 Speech LIVE: కాసేపట్లో పార్లమెంట్‌ కేంద్ర బడ్జెట్‌.. ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది?

Budget 2022: బడ్జెట్‌లో వాహనదారులకు శుభవార్త అందనుందా..? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!