AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ఉపాధి రంగంలో యువత అంచనాలకు పెద్దపీట వేస్తారా.. ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారు?

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్దికసంవత్సరానికి సంబంధించి దేశ బడ్జెట్ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపధ్యంలో ఉపాధి రంగంలో(Economy Budget 2022) ఆర్ధిక మంత్రి యువతకు ఎటువంటి విధానాలను ప్రకటించవచ్చు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Budget 2022: ఉపాధి రంగంలో యువత అంచనాలకు పెద్దపీట వేస్తారా.. ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారు?
Follow us
Venkata Chari

|

Updated on: Jan 18, 2022 | 10:33 PM

Economy Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022-23(Budget 2022) తయారీలో నిమగ్నమయ్యారు. రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, హెల్త్‌కేర్ రంగాలపై దృష్టి పెట్డుతూ బడ్జెట్ పత్రాలు రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 6 రంగాలు మాత్రమే 2030 నాటికి భారత జీడీపీకి $6 ట్రిలియన్‌లను జోడించగలవని మెకెంజీ అంచనా వేసింది. భారతదేశంలో ఉపాధి అనేది సామాజిక-ఆర్థిక సమస్య మాత్రమే కాదు. రాజకీయ సమస్య కూడా. కాబట్టి, రాష్ట్రమైనా లేదా జాతీయమైనా దాదాపు ప్రతి ఎన్నికలలో ఉపాధిని కూడా ఎన్నికల అంశంలో చేర్చుతుంటారు. అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలకు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నందున, 2022-23 కోసం కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఉద్యోగాల కల్పనపై(Economy Budget 2022) దృష్టి పెట్టడం సహజం. ముఖ్యంగా 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యువతకు 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీల నుంచి తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు.

ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానికి స్వంత వాదనలు ఉంటాయి. ఉద్యోగ కల్పన అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి అనేది వాస్తవం. 2020 జనవరిలో దేశంలో 7.2శాతం ఉన్న నిరుద్యోగిత రేటు మార్చి, ఏప్రిల్ నెలల్లో వరుసగా 23.5 శాతం పెరిగింది. తరువాతి నెలల్లో, ఇది 6-7 శాతం శ్రేణికి తిరిగి వచ్చినప్పటికీ, అది మళ్లీ డిసెంబర్ 2020లో 9 శాతం దాటింది. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మే-జూన్ 21లో దాదాపు 12 శాతానికి చేరుకుంది.

ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభంతో, పరిస్థితి మళ్లీ క్షీణించడం ప్రారంభించింది. CMIE విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, భారతదేశ నిరుద్యోగిత రేటు మరోసారి డిసెంబర్ 2021లో 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. చాలా మంది ఆర్థికవేత్తలు థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వేరియంట్‌లు ఆర్థిక పరిస్థితులలో చాలా అవసరమైన పునరుద్ధరణను దెబ్బతీస్తాయని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో, 2022-23 సాధారణ బడ్జెట్‌లో పరిశ్రమలను, ఉద్యోగాలను నెలకొల్పడం ప్రభుత్వానికి ఒక అవకాశంగా ఉంటుంది.

ఆగస్టు 2020లో, కన్సల్టెన్సీ సంస్థ మెకెంజీ ఒక నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి అదనంగా 60 మిలియన్ల మంది భారతదేశ వ్యవసాయేతర కార్మిక మార్కెట్లోకి ప్రవేశిస్తారని, 30 మిలియన్ల మంది ప్రజలు వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగానికి మారతారని అంచనా వేసింది. అంటే రానున్న 8 ఏళ్లలో 9 కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు పారిశ్రామిక రంగం సిద్ధం కావాలి. సామాజికంగా, విద్యాపరంగా మహిళా సాధికారత, సమానత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తే వీరితో పాటు అదనంగా 5.5 కోట్ల మంది మహిళలు కూడా ఈ లేబర్ మార్కెట్‌లోకి రావచ్చని నివేదిక పేర్కొంది. ఇది పెద్ద సవాల్ అని, దీని కోసం ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేయాలన్నారు.

2022-23 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఈ దిశలో బలమైన ప్రారంభం కాగలదు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ దాని చెడ్డ దశ నుంచి బయటపడిందని, ఈ మొత్తం 2021-22 సంవత్సరంలో 9 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అన్ని సంకేతాలు సూచిస్తున్నాయి. 2022-23లో కూడా GDPలో 9 శాతం రేటును కొనసాగించాలని ICRA అంచనా వేసింది. ఇది లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఎందుకంటే మెకెంజీ నివేదిక ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తికి ఉపాధి కల్పించాలంటే 2030 నాటికి 8 శాతం వృద్ధిని సాధించాలి. ఇది సవాలుతో కూడుకున్న లక్ష్యం. దీనిని సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో తీవ్రమైన సంస్కరణలను చేపట్టవలసి ఉంటుంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022-23 తయారీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, హెల్త్‌కేర్ రంగాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ 6 రంగాలు మాత్రమే 2030 నాటికి భారత GDPకి $6 ట్రిలియన్‌లను జోడించగలవని మెకెంజీ అంచనా వేసింది. 2024-25 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు, 2030 నాటికి 10 ట్రిలియన్లకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 6 రంగాలలో అవసరమైన, అర్థవంతమైన సంస్కరణలను ప్రారంభించడానికి ఆర్థిక మంత్రి రాబోయే బడ్జెట్‌ను అవకాశంగా ఉపయోగిస్తే, అది కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి ఒక కీలక అడుగు అవుతుంది.

రియల్ ఎస్టేట్ రంగం 2020, 2021లో మెరుగుదల సంకేతాలను చూపడం ప్రారంభించింది. JLL ఇండియా ప్రకారం, ఢిల్లీ-NCR, ముంబై, పూణే మార్కెట్లు 2021 మూడవ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ వినియోగంలో సంవత్సరానికి 8 శాతం వృద్ధిని సాధించాయి. జూలై-సెప్టెంబర్ 2021లో భారతదేశంలోని 8 మైక్రో మార్కెట్‌లలో సుమారు 56000 గృహాలు విక్రయించారు. ఇది సంవత్సరానికి 59 శాతం వృద్ధిని సాధించింది.

ప్రస్తుతం నిర్మలా సీతారామన్ రిజిస్ట్రేషన్ ఫీజులు, సుంకాలను తగ్గించడం ద్వారా ఇళ్లను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించగలరు. ఇది కాకుండా, నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడానికి సంబంధించిన విధానాలను రియల్ ఎస్టేట్‌లో వేగవంతం చేయవచ్చు. రియల్ ఎస్టేట్ బూమ్ నేరుగా ఇటుకలు, సిమెంట్, స్టీల్, ఎలక్ట్రికల్‌లను సూచిస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఉపాధి వనరుగా మారుతుంది.

తయారీ, నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి బడ్జెట్‌లో భూ సంస్కరణలకు భూమిని సిద్ధం చేయవచ్చు. ఒక అంచనా ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూమిని విడిపిస్తే, పరిశ్రమల కోసం భూమి ధర 25 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల పరిశ్రమల విస్తరణ సులభతరం కావడమే కాకుండా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కార్మిక సంస్కరణలను ఏమైనప్పటికీ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించింది. ఇది ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నారు. ఇది ఖచ్చితంగా సానుకూల ఫలితాలను కలిగి ఉంటుంది. పారిశ్రామిక పెట్టుబడుల పెరుగుదల ఉపాధి కల్పనకు దారి తీస్తుంది.

వ్యవసాయంలో సంస్కరణలు చాలా కష్టమైన పని. ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంలో తన గాయాలను నెట్టుకొస్తోంది. ప్రస్తుతానికి వ్యవసాయ సంస్కరణలపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అయితే వ్యవసాయ ఎగుమతులను పెంచడం, గిడ్డంగులలో పెట్టుబడిని వేగవంతం చేయడం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమను చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవచ్చు. గ్రామీణ యువత ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది.

దీనితో పాటుగా, ప్రభుత్వం MSMEలపై తన దృష్టిని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువత నగరాలకు వలస వెళ్లడాన్ని అరికట్టవచ్చు. వాస్తవానికి చిన్న పట్టణాలకు ఉపాధిని తీసుకోగలదు. ఇప్పటివరకు, MSME రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలు చాలా వరకు రుణాల సడలింపుకే పరిమితమయ్యాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి కల్పన మాధ్యమంగా మారడానికి కొత్త వెంచర్లను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది యువతను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే, అవసరమైన స్థాయిలో ఉపాధి కల్పన నిజంగా సృష్టించేందుకు అవకాశం ఉంది.

Also Read: Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!

Budget 2022: రాబోయే బడ్జెట్ నుంచి బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి మార్పులు మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు?