AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Prices: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..?

Rice Prices: భారతదేశం తన బాస్మతి బియ్యం ఉత్పత్తిలో సుమారు 75% ఎగుమతి చేస్తుంది. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం ఈ వాణిజ్యాన్ని నిలిపివేసింది. హర్యానాలోని ఒక ప్రధాన బియ్యం కేంద్రమైన హన్సీలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బియ్యం మిల్లులు ఎగుమతులపై..

Rice Prices: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..?
Rice Prices
Subhash Goud
|

Updated on: Aug 08, 2026 | 7:22 AM

Share

Rice Prices: ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. ఇంధనం, ఆహార ధరలు పెరగడంతో భారతదేశం కూడా ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. పండుగ సీజన్‌లో పండ్లు, కూరగాయలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బియ్యం ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి.

భారతదేశం నుండి దిగుమతి అయ్యే బియ్యం ధరలలో అత్యధిక పెరుగుదల కనిపించింది. గత మూడు నెలల్లో చిల్లర ధరలు ఒక్కో బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. భారతదేశంలో వరి ధర క్వింటాల్‌కు 800 నుంచి 900 రూపాయల వరకు పెరిగింది. రవాణా ఖర్చులు, మిల్లింగ్ ఖర్చులు, కస్టమ్స్ సుంకాలు కలిపిన తర్వాత, ఈ పెరుగుదల చిల్లర ధరలలో కూడా ప్రతిబింబిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.చెబుతోంది. చాలా రకాల బియ్యానికి టోకు ధరలు బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగాయని చెబుతున్నారు.

గత ఐదు నెలలుగా అనేక నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. మార్చి నెలతో పోలిస్తే ఆగస్టులో చక్కెర, పప్పులు, బియ్యం, పిండి, ఉప్పు, వంట నూనెల చిల్లర ధరలు పెరగడంతో ఇది సామాన్యుడి వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. బియ్యం ధరలో అత్యధిక పెరుగుదల నమోదైంది. దీని ధర కిలోకు రూ.50 నుండి రూ.70కి పెరిగింది.

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్త అనిశ్చితితో కలిసి దేశ బాస్మతి బియ్యం కూడా ఎగుమతి వ్యాపారానికి తీవ్ర దెబ్బతీశాయి. హన్సీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న బియ్యం మిల్లుల యజమానులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఓడరేవులలో కంటైనర్లు నిలిచిపోయాయి, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. చెల్లింపుల ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింది.

భారతదేశం తన బాస్మతి బియ్యంలో 75% ఎగుమతి చేస్తుంది:

భారతదేశం తన బాస్మతి బియ్యం ఉత్పత్తిలో సుమారు 75% ఎగుమతి చేస్తుంది. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం ఈ వాణిజ్యాన్ని నిలిపివేసింది. హర్యానాలోని ఒక ప్రధాన బియ్యం కేంద్రమైన హన్సీలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బియ్యం మిల్లులు ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బాస్మతి బియ్యానికి గిరాకీ బలంగా ఉన్నప్పటికీ, అనేక దేశాలలో బియ్యం కొరత కారణంగా, పెరిగిన రవాణా ఖర్చులు, ఎక్కువ సమయం పడుతున్నప్పటికీ కొనుగోలుదారులు భారతీయ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నారు. అయితే, రవాణా పరిమితులు మొత్తం ఎగుమతి వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం.. ఇక కోనలేమా…?

మార్కెట్‌లో విరివిగా వాడే బీపీటీ, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం వంటి నాణ్యమైన సన్నరకం బియ్యం ధరలు కిలోకు సగటున రూ.10 వరకు పెరిగాయి. గతంలో కిలోకు రూ.45 నుంచి రూ.50 పలికిన రకాలు ప్రస్తుతం రూ.60 నుంచి 65 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. అయితే ధరల పెరుగుదలకు అనేక కాణాలున్నాంటున్నారు వ్యాపారవేత్తలు. ధరల పెరుగుదలకు కృత్రిమ కొరతే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఉండవన్న ప్రచారంతో మిల్లర్లు, రైస్‌ డిపోల యజమానులు బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారు.

సిండికేట్‌గా మారి..

కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి పాతబియ్యం నిల్వలను గోదాముల్లో పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక మిల్లు వద్ద బస్తాపై రూ.100 పెరిగితే.. రిటైల్‌ మార్కెట్లకు వచ్చే సరికి రవాణా ఛార్జీలు కలుపుకొని రూ.300 వరకు చేరుతోంది. ఇక తెలంగాణలో బియ్యం ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుండగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో మాత్రం బియ్యం దిగుబడులు తగ్గడంతో అక్కడి వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌ నుంచి భారీగా సన్న వడ్లను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. గత సీజన్‌లలో ఆశించినస్థాయిలో సన్నాల సాగు జరగకపోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం, దిగుమతులు తగ్గడం బియ్యం ధరలకు రెక్కలు రావడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Tap Water: మీ కుళాయి నీరు తాగడానికి సురక్షితమేనా? 5 నిమిషాల్లో ఇంట్లోనే చెక్‌ చేసుకోండిలా..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..?
భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..?
గాల్లోయిల్ క్వినిక్ యాసిడ్స్‌తో కరోనా కట్టడి.. ఆసక్తికర విషయాలు
గాల్లోయిల్ క్వినిక్ యాసిడ్స్‌తో కరోనా కట్టడి.. ఆసక్తికర విషయాలు
తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో నాయిస్‌ ఐకాన్‌ బజ్‌ స్మార్ట్‌వాచ్
తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో నాయిస్‌ ఐకాన్‌ బజ్‌ స్మార్ట్‌వాచ్
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై లైంగిక దాడి కేసు!`
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై లైంగిక దాడి కేసు!`
తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్