AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 2000 Notes: బ్యాంకులకు భారీగా వచ్చి చేరుతున్న రూ.2000 నోట్లు

2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో దేశంలోని బ్యాంకులకు డిపాజిట్లు పెరిగిపోతున్నాయి. మే 23 నుంచి రూ.2000 నోట్లను విత్‌డ్రా చేసుకోవాలని లేదా బ్యాంకు..

Rs 2000 Notes: బ్యాంకులకు భారీగా వచ్చి చేరుతున్న రూ.2000 నోట్లు
2000 Notes
Subhash Goud
|

Updated on: Jun 18, 2023 | 3:57 PM

Share

2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో దేశంలోని బ్యాంకులకు డిపాజిట్లు పెరిగిపోతున్నాయి. మే 23 నుంచి రూ.2000 నోట్లను విత్‌డ్రా చేసుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆర్బీఐ కోరిందని, ఆ తర్వాత బ్యాంకులకు రూ.2000 నోట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయన్నారు.

రూ.3.26 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌

జూన్ 2తో ముగిసిన పక్షం రోజుల్లో వాణిజ్య బ్యాంకులు రూ.2000 నోట్ల రూపంలో డిపాజిట్ చేసిన కరెన్సీ రూ.3.26 లక్షల కోట్లు పెరిగింది. దీని వల్ల బ్యాంకుల డిపాజిట్లు రూ.187.02 లక్షల కోట్లకు చేరాయని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. ఈ డేటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్‌లో ఇవ్వబడింది. దీని ప్రకారం.. కేవలం 15 రోజుల్లో రూ. 3.26 లక్షల కోట్లు దేశ బ్యాంకుల్లో రూ. 2000గా వచ్చాయి. ఆ తర్వాత డిపాజిట్లు రూ. 187.02 లక్షల కోట్లకు పెరిగాయి. దీని కింద టర్మ్ డిపాజిట్లు రూ.2.65 లక్షల కోట్లకు పెరగగా, డిమాండ్ డిపాజిట్ల మొత్తం రూ.7,60,968 కోట్లకు చేరింది. ఈ 2000 రూపాయల నోట్లను బ్యాంకులకు తిరిగి ఇవ్వడం వల్ల ఈ ఏడాది 11.8 శాతం డిపాజిట్ వృద్ధి నమోదైంది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ జూన్ 8న సమాచారం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు సిస్టమ్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయన్నారు. 2023 మార్చి 31 వరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో ఇది 50 శాతం అంటే 50 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకు మార్కెట్లో రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు వా డుకలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి