AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: ఉద్యోగులపై నిఘా.. అమెజాన్‌కు రూ.290 కోట్ల జరిమానా..?

ఉద్యోగులను పర్యవేక్షించే అమెజాన్ విధానం కార్మికుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటుందని CNIL పేర్కొంది. హక్కుల గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తాము చేసే పనిలో తప్పేమీ లేదని అమెజాన్ చెబుతోంది. కంపెనీ ప్రకారం, ఈ పర్యవేక్షణ వ్యవస్థ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని..

Amazon: ఉద్యోగులపై నిఘా.. అమెజాన్‌కు రూ.290 కోట్ల జరిమానా..?
Amazon
Subhash Goud
|

Updated on: Jan 24, 2024 | 4:40 PM

Share

ఆన్‌లైన్ రిటైల్ కంపెనీగా అమెజాన్ (Amazon) బాగా పాపులర్. ఈ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాలలో సేవలను అందిస్తుంది. అమెజాన్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ అంతర్గత వ్యవస్థల్లో కొన్నింటికి అమెజాన్ ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సీఎన్‌ఐఎల్‌ (CNIL) భారీ జరిమానా విధించింది. ఉద్యోగుల పనితీరుపై మితిమీరిన నిఘా ఉంచిన కారణంగా భారతీయ కరెన్సీలో దాదాపు 290 కోట్ల రూపాయల అంటే 32 మిలియన్ యూరోల జరిమానాను అమెజాన్ చెల్లించాలని ఆదేశించింది. యూరోపియన్‌ యూనియన్‌ (EU) జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (GDPR) ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్‌ డేటాను సేకరించినట్లు సీఎన్‌ఐఎల్‌ ఆరోపించింది. దీనిపై ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి జరిమానా విధించినట్లు తెలిపింది.

ఉద్యోగులను పర్యవేక్షించే అమెజాన్ విధానం కార్మికుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటుందని CNIL పేర్కొంది. హక్కుల గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తాము చేసే పనిలో తప్పేమీ లేదని అమెజాన్ చెబుతోంది. కంపెనీ ప్రకారం, ఈ పర్యవేక్షణ వ్యవస్థ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించబడుతుంది. అమెజాన్ కూడా CNILని సవాలు చేయడానికి సిద్ధంగా ఉంది. సమయానికి కార్యాలయానికి హాజరు కాలేని వారికి ప్రమోషన్‌ను నిలిపివేస్తూ సంస్థ కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లు ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తూ కార్యాలయాలకు వెళ్లేందుకు అంగీకరించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి

వినియోగదారులు ఆర్డర్‌ చేసే ఉత్పత్తుల వివరాలను నమోదు చేసే స్కానింగ్ యంత్రాల ద్వారా నిఘా ఉంచినట్లు సీఎన్‌ఐఎల్‌ తెలిపింది. అయితే 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం అవి పనిచేయకుంటే.. యాజమాన్యానికి అలర్ట్‌ మెసేజ్‌ పంపుతాయని, వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరుని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు పని ప్రదేశంలో సదరు ఉద్యోగి ఎంత సేపు ఉంటున్నారనే దానిపై కూడా సమాచారం సేకరిస్తోందని ఈ తరహా నిఘా వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని CNIL వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us