చైనాతో పోటీపడాలంటే 14 గంటలు పనిచేయాల్సిందేనా..? భారత్లో హాట్ డిబేట్..!
కూటి కోసం కూలి కోసం అరబ్బు దేశాలకెళ్లి.. అక్కడి అక్రమార్కులకు చిక్కి ఎడారుల్లో గొర్రెల కాపరిగా మారి.. ఏళ్ల తరబడి కట్టుబానిసత్వం చేసి చిక్కి శల్యమైన ఒక అభాగ్యుడి జీవితం ఇటీవలే తెరమీదకెక్కి కంటతడి పెట్టించింది. సగటుమనిషి యంత్రాల చక్రాల మధ్య పడి ఎలా నలిగిపోతున్నాడో.. మెదడు కోల్పోయి యంత్రుడిగా ఎలా మారిపోతాడో.. యాంత్రికంగా పనిచేయడాన్ని ఎలా అలవాటుగా మార్చుకుంటాడో..

చికాగో నగరంలో 1886 మే 1న హే మార్కెట్లో ” ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు భానిస సంకెళ్లు తప్పా” అంటూ ఆకాశం చిల్లులు పడేలా గాండ్రించిన గొంతులు.. రోజుకు 8 గంటలతో కూడిన పని దినాలు, న్యాయమైన వేతనం, పని చేసే చోట మౌలిక సదుపాయాలు వంటివి సాధించిపెట్టాయి. నాటి ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైన కార్మికుల రక్తంతో హే మార్కెట్ ఎరుపెక్కింది. ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ కారణంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు మళ్లీ అన్యాయానికి గురయ్యే ప్రమాదం తలుపు చాటున తొంగి చూస్తూ ఉంది. పని గంటలపై తాజాగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు, ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని శ్రమను దోచుకునే మార్కెట్ శక్తులు ఏకం అవుతున్నాయనే ఆందోళన ఉద్యోగ, కార్మిక వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. కూటి కోసం కూలి కోసం అరబ్బు దేశాలకెళ్లి.. అక్కడి అక్రమార్కులకు చిక్కి ఎడారుల్లో గొర్రెల కాపరిగా మారి.. ఏళ్ల తరబడి కట్టుబానిసత్వం చేసి చిక్కి శల్యమైన ఒక అభాగ్యుడి జీవితం ఇటీవలే తెరమీదకెక్కి కంటతడి పెట్టించింది. సగటుమనిషి యంత్రాల చక్రాల మధ్య పడి ఎలా నలిగిపోతున్నాడో.. మెదడు కోల్పోయి యంత్రుడిగా ఎలా మారిపోతాడో.. యాంత్రికంగా పనిచేయడాన్ని ఎలా అలవాటుగా మార్చుకుంటాడో.. హాస్యచక్రవర్తి చార్లీ చాప్లిన్ బ్లాక్అండ్వైట్ రోజుల్లోనే చెప్పి చూపించాడు. ఇప్పుడు మన ఫ్యూచర్లు కూడా ఇంతకంటే దారుణంగా...