ఆ రైతును మీరే చంపారు సీఎం గారు-వైఎస్ జగన్
అమరావతి: సీఎం చంద్రబాాబు సభ కోెసం, ఆర్భాటం కోసం రైతును చంపేశారంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. కొండవీడులోని కోటయ్యను అనే రైతును కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్లో పేర్కొన్నారు. హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది..సీఎం సభ కోసం పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడంతో పాటు, […]
అమరావతి: సీఎం చంద్రబాాబు సభ కోెసం, ఆర్భాటం కోసం రైతును చంపేశారంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. కొండవీడులోని కోటయ్యను అనే రైతును కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్లో పేర్కొన్నారు. హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది..సీఎం సభ కోసం పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడంతో పాటు, పొలంలోకి రాకుండా రైతును నిలవరించే ప్రయత్నం చేశారు పోలీసులు. రైతు ప్రతిఘటించడంతో లాఠీలకు పని చెప్పారు. ఆ తర్వాత కొంతసేపటికే ఆ రైతు మరణించడం చర్చనీయాశంగా మారింది.
కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 2019