ఆ రైతును మీరే చంపారు సీఎం గారు-వైఎస్ జగన్

అమరావతి: సీఎం చంద్రబాాబు సభ కోెసం, ఆర్భాటం కోసం రైతును చంపేశారంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్  ఆరోపించారు. కొండవీడులోని కోటయ్యను అనే రైతును కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు. హెలికాప్టర్‌ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది..సీఎం సభ కోసం పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడంతో పాటు, […]

ఆ రైతును మీరే చంపారు సీఎం గారు-వైఎస్ జగన్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:23 PM

అమరావతి: సీఎం చంద్రబాాబు సభ కోెసం, ఆర్భాటం కోసం రైతును చంపేశారంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్  ఆరోపించారు. కొండవీడులోని కోటయ్యను అనే రైతును కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు. హెలికాప్టర్‌ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది..సీఎం సభ కోసం పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడంతో పాటు, పొలంలోకి  రాకుండా రైతును  నిలవరించే ప్రయత్నం చేశారు పోలీసులు.  రైతు ప్రతిఘటించడంతో లాఠీలకు పని చెప్పారు.  ఆ తర్వాత కొంతసేపటికే ఆ రైతు మరణించడం చర్చనీయాశంగా మారింది.