భార్య ఫిర్యాదుతో ఆ లాయర్‌ జడ్జ్ పోస్ట్‌కు ఎసరు

ఎంపిక జాబితాలో పేరు ఉన్నప్పటికీ సరైన రీజన్స్  ఉంటే  వారి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

భార్య ఫిర్యాదుతో ఆ లాయర్‌ జడ్జ్ పోస్ట్‌కు ఎసరు
Follow us

|

Updated on: Oct 15, 2020 | 5:26 PM

ఎంపిక జాబితాలో పేరు ఉన్నప్పటికీ సరైన రీజన్స్  ఉంటే  వారి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దీనిపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. హైకోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ దాఖలైన ఓ అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. జిల్లా జడ్జ్ పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు 2017 మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక పరీక్షలో పాసై, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన ఓ లాయర్‌పై క్రిమినల్‌ కేసు పెండింగులో ఉండటంతో ఎంపిక లిస్ట్ నుంచి నుంచి నుంచి పేరు తొలగించారు. దీనిని ఆయన హైకోర్టులో సవాల్‌ చేశారు. గృహహింస చట్టం కింద ఆయనపై కేసు నమోదుకాగా.. ఆ కేసులో ఆ తర్వాత  నిర్దోషిగా బయటపడ్డారు. అయితే, నియామక ప్రక్రియ జరిగిన తేదీ నాటికి క్రిమినల్‌ కేసు పెండింగులో ఉందనీ, ఓ ఏడాది తర్వాత దానిలో నిర్దోషిగా నిర్ధారణ అయినంతమాత్రాన గడియారాన్ని వెనక్కి తిప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడం తప్పేమీ కాదని జస్టిస్ అశోక్ భూషన్, ఎంఆర్ షాల ధర్మాసనం పేర్కొంది.

Also Read :

దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె