AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్.కృష్ణయ్యపై వీహెచ్ ఫైర్

హైదరాబాద్ : బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండపడ్డారు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్‌ దగ్గరనున్న కృష్ణయ్య.. ఇప్పుడు వైసీపీ దగ్గరకు వెళ్లారంటూ మండిపడ్డారు. కేవలం బీసీ నాయకుడివనే రాహుల్ గాంధీ.. మిర్యాలగూడ సీటు ఇచ్చారని వీహెచ్ అన్నారు. అవకాశవాద బీసీ రాజకీయ నాయకుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీల నేతలకు బీసీలు గుర్తుకు వస్తారని సెటైర్లు వేసిన వీహెచ్.. చేసేది […]

ఆర్.కృష్ణయ్యపై  వీహెచ్ ఫైర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 19, 2019 | 11:35 AM

Share

హైదరాబాద్ : బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండపడ్డారు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్‌ దగ్గరనున్న కృష్ణయ్య.. ఇప్పుడు వైసీపీ దగ్గరకు వెళ్లారంటూ మండిపడ్డారు. కేవలం బీసీ నాయకుడివనే రాహుల్ గాంధీ.. మిర్యాలగూడ సీటు ఇచ్చారని వీహెచ్ అన్నారు. అవకాశవాద బీసీ రాజకీయ నాయకుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీల నేతలకు బీసీలు గుర్తుకు వస్తారని సెటైర్లు వేసిన వీహెచ్.. చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ అని వీహెచ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ఆలోచనలు చేస్తోందన్న ఆయన.. బీసీలకు పెట్టిన క్రిమీలేయర్ ఎత్తివేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.