AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలస కూలీలకు ఏ లోటు రానివ్వద్దు – కేంద్రం

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో రవాణా సదుపాయాలు లేకపోవడంతో వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఇబ్బందిపడుతున్న వలస వలస కూలీల సౌకర్యాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. దేశం నలుమూలల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ […]

వలస కూలీలకు ఏ లోటు రానివ్వద్దు - కేంద్రం
Balaraju Goud
|

Updated on: May 19, 2020 | 2:44 PM

Share

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో రవాణా సదుపాయాలు లేకపోవడంతో వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఇబ్బందిపడుతున్న వలస వలస కూలీల సౌకర్యాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. దేశం నలుమూలల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వలస కూలీలను తీసుకెళ్లడానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను, బస్సులను నడపాలని పేర్కొంది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అంతేకాకుండా వలస కూలీలు ఏమార్గంలో వెళ్లాలనుకున్న వారికి అవకాశం కల్పించాలని సూచించారు. వారికి మార్గమధ్యంలో విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరమైతే ఎన్‌జీవో సంస్థల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. వలస కూలీలకు ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గృహాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, వారికి నిత్యం ఆహారం అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇక రైలు పట్టాలు, రోడ్ల వెంబడి వలస కూలీలు నడవకుండా చూసేలా ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు అజయ్‌ భల్లా పేర్కొన్నారు. ఈమేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖను ట్విటర్‌లో కూడా షేర్‌ చేశారు.

Spokesperson, Ministry of Home Affairs @PIBHomeAffairs · 4h Proactive coord between States & @RailMinIndia reqd to run more trains; run more buses for smooth transport of #MigrantWorkers. Create rest places with food etc for people on foot, till they are guided to bus/rail stations. Dispel rumours, give clarity on train/bus departures:MHA Show this thread