AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ వైఎస్.. జడ్జిలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చారు, మరి వాటి సంగతేంటి. !’

రాబోయే కాలం మాది…పోయేకాలం వైసీపీది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. వాసుపల్లి గణేష్ ఎమ్మల్యేగా రాజీనామా చేయకుండా పార్టీ విడిచి వెళ్లారంటూ విమర్శించారు. తనకు, బండారుకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. అయినా విలువలకు కట్టుబడి పార్టీ మారలేదన్నారు. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారని.. ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని అయ్యన్న తప్పుబట్టారు. ఏం చేద్దామని వైసీపీలోకి వెళ్లారన్న ఆయన.. సొంత […]

' వైఎస్.. జడ్జిలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చారు, మరి వాటి సంగతేంటి. !'
Venkata Narayana
|

Updated on: Sep 20, 2020 | 8:22 PM

Share

రాబోయే కాలం మాది…పోయేకాలం వైసీపీది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. వాసుపల్లి గణేష్ ఎమ్మల్యేగా రాజీనామా చేయకుండా పార్టీ విడిచి వెళ్లారంటూ విమర్శించారు. తనకు, బండారుకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. అయినా విలువలకు కట్టుబడి పార్టీ మారలేదన్నారు. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారని.. ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని అయ్యన్న తప్పుబట్టారు. ఏం చేద్దామని వైసీపీలోకి వెళ్లారన్న ఆయన.. సొంత పార్టీ వారికే జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం‌లేదు… వైసీపీలోకి వెళ్లిన వారందరూ ఇంట్లో కాళీగా కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. నెలాఖరుకల్లా టీడీపీ జిల్లా కమిటీలు ప్రకటిస్తామని.. విశాఖ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. జగన్ యూరప్ లో ఒక సలహాదారుని నియమించుకున్నారు.. రాష్ట్రం ఆర్ధిక పరిస్ధితి అధోగతిలో ఉన్నప్పుడు దుబారా ఖర్చుకాదా అంటూ వ్యాఖ్యానించారు అయ్యన్న. అమరావతిలో జడ్జిలకు చంద్రబాబు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. 2005 లో వైఎస్ సీఎం గా వున్నపుడు హైదరాబాదులో 500 చ.గ. చొప్పున ఇళ్ల స్ధలాలు న్యాయమూర్తులకు ఇచ్చారని.. అదీ దురుద్దేశంతో ఇచ్చినట్లేనా అని ఆయన వైసీపీ నేతల్ని నిలదీశారు.