AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సుశాంత్ బ్యాంక్ ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయి’ ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ్యాంకు ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసును..

'సుశాంత్ బ్యాంక్ ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయి'  ?
Umakanth Rao
|

Updated on: Aug 04, 2020 | 4:26 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ్యాంకు ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఈ విషయంలో మౌనంగా ఎందుకు ఉన్నారని, దర్యాప్తు ఎందుకు చేయడంలేదని అన్నారు. గత నాలుగేళ్లలో దాదాపు 50 కోట్ల రూపాయలు సుశాంత్ బ్యాంకు అకౌంట్ కి క్రెడిట్ అయ్యాయని, అయితే ఆశ్చర్యంగా ఈ మొత్తమంతా విత్ డ్రా అయిందని ఆయన తెలిపారు. ఒక ఏడాదిలో ఆయన ఖాతాకు 17 కోట్లు జమ కాగా.. ఈ మొత్తంలో 15 కోట్లు విత్ డ్రా అయ్యాయి. ఇది దర్యాప్తులో కీలక విషయం కాదా అన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై తాము ముంబై పోలీసులను ప్రశ్నిస్తామని, మౌనంగా ఉండబోమని అన్నారు.

తమ పోలీసు శాఖకు చెందిన అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించిన విషయాన్నిఆయన తప్పు పట్టారు. ఆయనను దాదాపు హౌస్ అరెస్టు చేశారని పాండే మండిపడ్డారు.