AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్..వివరాలు సూపర్ !

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి ఏపీలోని  నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం జగన్ అమరావతి సచివాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు. ఉద్యోగావకాశాలు కల్పించడం.. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం.. ఆదిశగా చదువులు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం సీఎం జగన్ ఈ సమీక్షలో […]

నిరుద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్..వివరాలు సూపర్ !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 25, 2019 | 3:58 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి ఏపీలోని  నిరుద్యోగులకు శుభవార్త వెల్లడించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం జగన్ అమరావతి సచివాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు.

ఉద్యోగావకాశాలు కల్పించడం.. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం.. ఆదిశగా చదువులు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం సీఎం జగన్ ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధికోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూనివర్శిటీ కింద ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీని స్థాపించాలని, రాష్ట్రవ్యాప్తంగా యూనివర్శిటీ పరిధిలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌కాలేజీలు స్థాపించాలని జగన్ సూచించారు.

నైపుణ్యాభివృద్ధికోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణనిచ్చే బాధ్యతలను యూనివర్శిటీలకు అప్పగించాలని ఆదేశించారు. చదువు పూర్తిచేసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి దగ్గాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని సీఎం ఈ సమీక్ష సందర్బంగా వెల్లడించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్‌ సౌకర్యం కల్పించాలని, అప్రెంటిస్‌ అయ్యాక ఇంకా శిక్షణ అవసరమనుకుంటే.. మళ్లీ నేర్పించాలని, ఆతర్వాతే పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

నెలరోజుల్లోగా కార్యచరణకు సీఎం ఆదేశం

తాను చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు అనుగుణంగా ఒక నెల రోజుల్లోగా పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలని, ఇందుకోసం ఒక ప్రణాళిక సిద్దం చేయాలని జగన్ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాథి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపేయాలన్నసీఎం నిర్దేశించారు. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజి రూపురేఖలు మారాల్సిందేనని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్‌ జరగాలని, స్థానికంగా వారి సేవలను పొందేలా ఒక యాప్‌ను రూపొందించాలని, దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని సీఎం వివరించారు.