AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరంపై కేంద్రానికి సుప్రీం షాక్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులేమీ వుండబోవన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం షాకిచ్చింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేశారంటూ ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టుతోపాటు నిర్మాణ చిత్రాలను కోర్టుకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒడిషా, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బచావత్ […]

పోలవరంపై కేంద్రానికి సుప్రీం షాక్
Rajesh Sharma
|

Updated on: Jan 14, 2020 | 2:19 PM

Share

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులేమీ వుండబోవన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం షాకిచ్చింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేశారంటూ ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టుతోపాటు నిర్మాణ చిత్రాలను కోర్టుకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఒడిషా, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారంటూ ఒడిషా ప్రభుత్వం తరపున న్యాయవాది తమ వాదనను వినిపించారు. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పోలవరం నిర్మాణంపై తమకెలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, మణుగూరు ప్లాంటు, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు నివేదించారు.

అయితే, రెండు రాష్ట్రాల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రాజెక్టు నిర్మాణం యధావిధిగానే కొనసాగుతుందని, ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. ఒడిషా, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం రెండు వారాల్లో ఇస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దాంతో కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
విఫలమైన ఇస్రో PSLV-C62 ప్రయోగం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
విఫలమైన ఇస్రో PSLV-C62 ప్రయోగం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?