బీజేపీలోకి రవీంద్ర జడేజా భార్య
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీలోకి చేరారు. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో ఆమె బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రివాబా మాట్లాడుతూ నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని అందుకే బీజేపీలో చేరుతున్నానని అన్నారు. బీజేపీలో చేరడం ద్వారా దేశం మొత్తానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. అయితే రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయాలని ఉందని రివాబా గత కొంతకాలంగా చెబుతూ వస్తోన్న […]
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీలోకి చేరారు. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో ఆమె బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రివాబా మాట్లాడుతూ నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని అందుకే బీజేపీలో చేరుతున్నానని అన్నారు. బీజేపీలో చేరడం ద్వారా దేశం మొత్తానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. అయితే రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయాలని ఉందని రివాబా గత కొంతకాలంగా చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కాగా రివాబాతో పాటు కర్నిసేన మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా బీజేపీలో చేరారు.