చైనాను కబళిస్తున్న కరోనా.. 32 వేలకు పైగా కేసులతో హైరానా

చైనాలోని వూహాన్ లో తలెత్తిన భయంకర కరోనా.. అడ్డూ, అదుపూ లేకుండా విజృంభిస్తోంది. చైనాలో ఈ వ్యాధి బారిన పడి  మరణించినవారి సంఖ్య సుమారు 725 కు పెరగగా.. 32 వేలకు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2002-2003 లో సార్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 770 మంది మృత్యువాత పడ్డారు. ఆ వ్యాధి లక్షణాలే కరోనాకు కారణమన్న వాదనను చైనా […]

చైనాను కబళిస్తున్న కరోనా.. 32 వేలకు పైగా కేసులతో హైరానా
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 08, 2020 | 7:34 PM

చైనాలోని వూహాన్ లో తలెత్తిన భయంకర కరోనా.. అడ్డూ, అదుపూ లేకుండా విజృంభిస్తోంది. చైనాలో ఈ వ్యాధి బారిన పడి  మరణించినవారి సంఖ్య సుమారు 725 కు పెరగగా.. 32 వేలకు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2002-2003 లో సార్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 770 మంది మృత్యువాత పడ్డారు. ఆ వ్యాధి లక్షణాలే కరోనాకు కారణమన్న వాదనను చైనా తోసిపుచ్చింది. వూహాన్ సిటీలోని సీఫుడ్ మార్కెట్ నుంచి ప్రారంభమైన కరోనాకు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నా.. ఈ రాకాసి వ్యాధి మాత్రం అనేకమందిని బలి తీసుకుంటోంది. యుఎస్, నేపాల్, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, తైవాన్, మలేసియా , వియత్నాం తదితర దేశాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో.. కేరళలో మూడు కేసులను నిర్ధారించారు. అయితే ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి నివారణ చర్యలను యుధ్ధ ప్రాతిపదికన చేబట్టిన దృష్ట్యా.. ఎలాంటి ఆందోళనా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

కాగా-చైనాలోని ఆసుపత్రుల్లో కరోనా ఇన్ఫెక్షన్ సోకి హాస్పిటల్స్  సిబ్బంది కూడా అస్వస్థులవుతున్నారు. ఈ వ్యాధికారణంగా ఓ డాక్టర్ మరణించాడు. కరోనా సోకిన పేషంట్లకు ఇస్తున్న ఆహారాన్ని కూడా డాక్టర్లు మార్చేశారు. వారికి ఇప్పటివరకు చేపలతో తయారైన డైట్ ఇస్తుండగా.. దీని బదులు తాబేళ్ల మాంసంతో చేసిన డిష్ లను ఇస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి.

Latest Articles
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్