AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమిషనర్ సజ్జన్నార్‌కు షాక్… ఏమైందంటే?

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్‌ను 95 శాతం మంది ప్రజలు పొగుడుతుంటే… మరోవైపు నుంచి మాత్రం ఆయనకు షాక్ ఎదురైంది. దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, కిరాతకంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన చర్యను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. నేరస్థులను బహిరంగంగా శిక్షించాలన్న డిమాండ్‌ను నారీ లోకం ముక్తకంఠంతో వినిపించింది. వినిపిస్తున్న డిమాండ్ల వల్లనో.. లేక నేరస్థులు పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనో సైబరాబాద్ పోలీసులు.. నలుగురిని […]

కమిషనర్ సజ్జన్నార్‌కు షాక్... ఏమైందంటే?
Rajesh Sharma
|

Updated on: Dec 06, 2019 | 2:52 PM

Share

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్‌ను 95 శాతం మంది ప్రజలు పొగుడుతుంటే… మరోవైపు నుంచి మాత్రం ఆయనకు షాక్ ఎదురైంది. దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, కిరాతకంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన చర్యను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. నేరస్థులను బహిరంగంగా శిక్షించాలన్న డిమాండ్‌ను నారీ లోకం ముక్తకంఠంతో వినిపించింది. వినిపిస్తున్న డిమాండ్ల వల్లనో.. లేక నేరస్థులు పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనో సైబరాబాద్ పోలీసులు.. నలుగురిని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్‌కౌంటర్ చేశారు.

శుక్రవారం తెల్లవారుతుండగానే వినిపించిన ఎన్‌కౌంటర్ వార్తలపై యావత్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తెలంగాణ పోలీసులను ఆకాశానికెత్తేసింది. మాటలు లేకుండా చేతల్లో నేరస్థులకు శిక్ష వేసి చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌పైనా పలువురు ప్రశంసలు కురిపించారు. ఇదంతా బాగానే వున్నా.. అందరి చేత ప్రశంసంలందుకుంటున్న సజ్జన్నార్‌కు తాజాగా షాక్ తగిలింది.

జాతీయ మానవ హక్కుల సంఘం దిశ కేసుల ఎన్‌కౌంటర్‌పై సూమోటోగా రియాక్టయ్యింది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై మానవ హక్కుల సంఘం వెంటనే స్పందించింది. పోలీసుల అదుపులో, కస్టడీలో వున్న వ్యక్తులు ఎన్‌కౌంటర్‌కు గురి కావడమేంటని విస్మయం వ్యక్తం చేసింది మానవ హక్కుల సంఘం. దీనిపై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.

ఉదంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి వుందని అభిప్రాయపడింది ఎన్.హెచ్.ఆర్.సీ. ఎన్‌కౌంటర్ ఉదంతానికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపాలని ఎన్.హెచ్.ఆర్.సీ. నిర్ణయించింది. నిజనిర్ధారణ బృందాన్ని పంపి, వీలైనంత త్వరగా నివేదిక తెప్పించుకోవాలని ఎన్.హెచ్.ఆర్.సీ. తీర్మానించింది.

Follow Us
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?