దుబాయ్ చేరుకున్న పాంటింగ్, ఆరు రోజులు క్వారంటైన్
ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్పటికే జట్లన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న ఆరు రోజుల క్వారంటైన్ నేటితో కంప్లీట్ అవ్వనుంది.
ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్పటికే జట్లన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న ఆరు రోజుల క్వారంటైన్ నేటితో కంప్లీట్ అవ్వనుంది. దీంతో ప్రాక్టీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆదివారమే దుబాయ్ చేరుకుంది. తాజాగా ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అక్కడ ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ద్వారా అతడికి స్వాగతం తెలిపింది.
ఈ ఆరు రోజుల్లో ఆటగాళ్లకు మూడుసార్లు కరోనా టెస్టులు చేయనున్నారు. ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారినే బయో బబుల్లోకి అనుమతిస్తారు. తాజాగా దుబాయ్ చేరిన పాంటింగ్ కూడా ఆరు రోజులు క్వారంటైన్లో ఉండనున్నాడు. తాను హోటల్లో అడుగుపెట్టిన అనంతరం తీసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు పాంటింగ్.
????? ?????? ?? ?? ?️
Welcome to Dubai, @RickyPonting ?#Dream11IPL #YehHaiNayiDilli @Address_Hotels pic.twitter.com/9jL2BCnwQC
— Delhi Capitals (Tweeting from ??) (@DelhiCapitals) August 27, 2020