AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబు నోట విధ్వంసం మాట.. ఎవరికో ఈ హెచ్చరిక?

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు విధ్వంసం గురించి మాట్లాడారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు.. మధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విధ్వంసం ప్రస్తావన తేవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ప్రారంభించిన కట్టడాలను జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలే జరగలేదని వైసీపీ నేతలు అబద్దపు […]

బాబు నోట విధ్వంసం మాట.. ఎవరికో ఈ హెచ్చరిక?
Rajesh Sharma
|

Updated on: Nov 28, 2019 | 4:06 PM

Share

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు విధ్వంసం గురించి మాట్లాడారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు.. మధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విధ్వంసం ప్రస్తావన తేవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ప్రారంభించిన కట్టడాలను జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలే జరగలేదని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని, జరుగుతున్న వాటిని ప్రపంచానికి చూపిస్తానని చంద్రబాబు అమరావతి పర్యటనకు పూనుకున్నారు.

అయితే, గురువారం ఉదయం రాజధాని ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు పర్యటనకు మిశ్రమ స్పందన కనిపించింది. తొలుత బాబును రావద్దంటూ అడ్డుకున్న కొందరు రైతులు.. ఆయన పయనిస్తున్న బస్సుపై రాళ్ళు, చెప్పులు విసిరారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబును ఘన స్వాగతం పలికారు కొందరు రైతులు.

ఈక్రమంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఉద్విగ్నానికి గురయ్యారు. శిలాపలకానికి సాష్టాంగ వందనం చేశారు. ఆ తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విధ్వంసం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. రాజధాని ప్రాంతాన్ని జగన్ విధ్వంసం చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రం క్రెడిబిలిటీ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మొత్తానికి చంద్రబాబు పర్యటన లాగానే ఆయన చేసిన విధ్వంసం వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Follow Us
విద్యార్థినులకు శుభవార్త.. ఉచితంగా వాటి పంపిణీ
విద్యార్థినులకు శుభవార్త.. ఉచితంగా వాటి పంపిణీ
తిన్న వెంటనే టీ తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
తిన్న వెంటనే టీ తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. పోలీస్‌ స్టేషన్‌లో ఆటోలకు బేడీలు వేసిన
వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. పోలీస్‌ స్టేషన్‌లో ఆటోలకు బేడీలు వేసిన
టీమిండియాలో వాడు మా జట్టులో ఉంటే బాగుండేది..
టీమిండియాలో వాడు మా జట్టులో ఉంటే బాగుండేది..
డిబ్రుగఢ్‌లో ప్రారంభమైన న్యూస్9 ఇండియన్ టైగర్స్ ఫుట్‌బాల్ ట్రయల్స
డిబ్రుగఢ్‌లో ప్రారంభమైన న్యూస్9 ఇండియన్ టైగర్స్ ఫుట్‌బాల్ ట్రయల్స
జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం..
జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం..
36 సినిమాలు తీస్తే 26 ప్లాప్.. అయినా ఇండస్ట్రీకే తోపు డైరెక్టర్..
36 సినిమాలు తీస్తే 26 ప్లాప్.. అయినా ఇండస్ట్రీకే తోపు డైరెక్టర్..
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!
ఆ మెగా హీరో కోసం రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన మహేష్ బాబు..
ఆ మెగా హీరో కోసం రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన మహేష్ బాబు..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్