AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కటి కాదు మూడు రాజధానులు.. జగన్ చెప్పేశారుగా..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జోరందుకున్న వివాదానికి తనదైన శైలిలో వినూత్న పరిష్కారాన్ని చూపబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రెండు సంస్థల ద్వారా ఏపీ రాజధానిపై అధ్యయనం చేయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకటి, రెండు వారాల్లో ఈ రెండు రిపోర్టులు వస్తాయని, వాటిని సమీక్షించిన తర్వాత రాజధానిపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జగన్ వెల్లడించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ భావితరాల బాగోగులను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని, తమ నిర్ణయంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు వుండవని […]

ఒక్కటి కాదు మూడు రాజధానులు.. జగన్ చెప్పేశారుగా..!
Rajesh Sharma
|

Updated on: Dec 17, 2019 | 6:30 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జోరందుకున్న వివాదానికి తనదైన శైలిలో వినూత్న పరిష్కారాన్ని చూపబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రెండు సంస్థల ద్వారా ఏపీ రాజధానిపై అధ్యయనం చేయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఒకటి, రెండు వారాల్లో ఈ రెండు రిపోర్టులు వస్తాయని, వాటిని సమీక్షించిన తర్వాత రాజధానిపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జగన్ వెల్లడించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ భావితరాల బాగోగులను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని, తమ నిర్ణయంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు వుండవని జగన్ చెప్పారు.

రాజధాని పేరిట చంద్రబాబు భూబాగోతాలు నడిపారంటూ నిప్పులు చెరిగారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజధాని ప్రాంతంలో 4,070 ఎకరాలను తన బినామీలకు, తన వాళ్ళకు చంద్రబాబు కేటాయించారని జగన్ వివరించారు.

జగన్ తన ప్రసంగంలో దక్షిణ ఆఫ్రికా ఫార్ములాను ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు వున్న సంగతిని తెలిపారు. అదే విధంగా వినూత్న నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయని జగన్ చెప్పారు. ప్రస్తుతం వున్న అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామన్న హింట్ ఇచ్చారు ముఖ్యమంత్రి. విశాఖలో బ్రహ్మాండమైన మౌలిక వసతులు వున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అదే విధంగా జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలు నగరాన్ని గుర్తించే అవకాశాలున్నాయన్నారు సీఎం జగన్.

అయితే.. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని, రాజధాని అంశంపై అధ్యయానికి నియమించిన రెండు కమిటీలు మరో రెండు వారాల్లో నివేదిక ఇస్తాయని, వాటిపై కూలకషంగా చర్చలు జరిపిన తర్వాతనే తగిన నిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారు.

Follow Us
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..