AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 రాజధానులు సరే.. మరి భూములిచ్చిన రైతుల మాటేంటి?

3 రాజధానుల పేరిట పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. అయితే ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం వుందంటున్నారు బిజెపి నేతలు. ఇంకా ఎంత కాలం ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రాజధానిపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ లేకుండా వ్యవహరించడం వల్లనే అయిదేళ్ళ తర్వాత కూడా సందిగ్ధత కొనసాగుతోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి నేతలు జివిఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణు వర్ధన్ […]

3 రాజధానులు సరే.. మరి భూములిచ్చిన రైతుల మాటేంటి?
Rajesh Sharma
|

Updated on: Dec 18, 2019 | 12:32 PM

Share

3 రాజధానుల పేరిట పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. అయితే ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం వుందంటున్నారు బిజెపి నేతలు. ఇంకా ఎంత కాలం ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర రాజధానిపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ లేకుండా వ్యవహరించడం వల్లనే అయిదేళ్ళ తర్వాత కూడా సందిగ్ధత కొనసాగుతోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి నేతలు జివిఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణు వర్ధన్ రెడ్డి, టిజి వెంకటేశ్ తదితరులు ఏపీకి మూడు రాజధానులు వుండొచ్చు అన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై స్పందించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను బిజెపి నేతలు స్వాగతించారు. అయితే అమరావతిలోను హైకోర్టు బెంచ్ వుండాలని అంటున్నారు కమల నాథులు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయొచ్చని, కానీ అమరావతిలోనే లిజిస్లేచర్ క్యాపిటల్‌తోపాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వుండాల్సిన అవసరం వుందని, ఈ రెండు వేరు వేరు చోట్ల వుండడం కరెక్టు కాదని అంటున్నారు కమలం నేతలు.

రాజధాని ఒకటే వుండాలని, పరిపాలన వ్యవహారాలను మూడు చోట్ల ఏర్పాటు చేయవచ్చని బిజెపి నేతలు చెబుతున్నారు. రాజధాని అంటే ఒకటే సిటీ అన్న అభిప్రాయం వుంటుంది కాబట్టి.. ముందుగా రాజధాని ఒకటే ప్రకటించి… మూడు ప్రాంతాల్లో వాటికి సంబంధించిన భవనాల వికేంద్రీకరణ జరిగితే బావుంటుందని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని ఎక్కడ అనేది పరిపాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, దీన్ని రాజకీయ కోణంలోను, సామాజిక వర్గాల ప్రాతిపదికన చూడడం కరెక్టు కాదని చెబుతున్నారు. రాజధాని అమరావతినే కొనసాగిస్తూ.. కర్నూలు, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రధాన ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలంటున్నారు బిజెపి నేతలు.

తొందరపాటుతో, రాజకీయ అవసరాల కోసం రాజధానిపై నిర్ణయం తీసుకోవద్దని, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు జివిఎల్, కన్నా.

Follow Us
దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో బాడీబిల్డర్‌ మృతి!
దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో బాడీబిల్డర్‌ మృతి!
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..