AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక ఉగ్రదాడి: బిలియనీర్ పిల్లలు ముగ్గురు మృతి

శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన దాడులు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వివిధ దేశాలకు చెందిన దాదాపు 300మంది శ్రీలంక పేలుళ్లలో మరణించారు. కాగా ఈ దాడిలో డెన్మార్క్‌కు చెందిన బిలియనీర్ ఆండర్స్ హోల్ష్ పోవిజన్ పిల్లల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. డెన్మార్క్‌ ఫ్యాషన్‌ రంగంలో పలు బ్రాండ్లకు అధిపతి అయిన ఆండర్స్.. ఆ దేశంలో బిగ్గెస్ట్ రిచెస్ట్‌మ్యాన్‌గా పేరు గాంచారు. కాగా శ్రీలంక పేలుళ్లలో ఏడుగురు […]

శ్రీలంక ఉగ్రదాడి: బిలియనీర్ పిల్లలు ముగ్గురు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 6:49 PM

Share

శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన దాడులు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వివిధ దేశాలకు చెందిన దాదాపు 300మంది శ్రీలంక పేలుళ్లలో మరణించారు. కాగా ఈ దాడిలో డెన్మార్క్‌కు చెందిన బిలియనీర్ ఆండర్స్ హోల్ష్ పోవిజన్ పిల్లల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. డెన్మార్క్‌ ఫ్యాషన్‌ రంగంలో పలు బ్రాండ్లకు అధిపతి అయిన ఆండర్స్.. ఆ దేశంలో బిగ్గెస్ట్ రిచెస్ట్‌మ్యాన్‌గా పేరు గాంచారు. కాగా శ్రీలంక పేలుళ్లలో ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యుల హస్తం ఉందని తెలుస్తోంది.