AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుజీత్ కోసం ప్రార్థిస్తూ..తమ చిన్నారిని కోల్పోయారు..

సుజీత్..గత కొన్ని రోజులుగా దేశం మొత్తం వినిపించిన పేరు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డ ఈ చిన్నారి క్షేమంగా బయటకి రావాలని దేశం మొత్తం ప్రార్థించింది. తమిళనాడులో నివశిస్తున్న ఓ కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. ఆ చిన్నారి ప్రాణాలతో బయటకి వచ్చి..కన్నవాళ్లకు చేరువవ్వాలని సదరు కుటుంబానికి చెందిన భార్యభర్తలు కూడా కోరుకున్నారు. టీవీలో సుజీత్ సంబంధించిన వార్తలను నిశితంగా గమనిస్తూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. కానీ వారు మంచి కోరుకుంటున్నా కూడా దైవం మాత్రం ఆ ఇంట్లో […]

సుజీత్ కోసం ప్రార్థిస్తూ..తమ చిన్నారిని కోల్పోయారు..
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2019 | 8:57 PM

Share

సుజీత్..గత కొన్ని రోజులుగా దేశం మొత్తం వినిపించిన పేరు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డ ఈ చిన్నారి క్షేమంగా బయటకి రావాలని దేశం మొత్తం ప్రార్థించింది. తమిళనాడులో నివశిస్తున్న ఓ కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. ఆ చిన్నారి ప్రాణాలతో బయటకి వచ్చి..కన్నవాళ్లకు చేరువవ్వాలని సదరు కుటుంబానికి చెందిన భార్యభర్తలు కూడా కోరుకున్నారు. టీవీలో సుజీత్ సంబంధించిన వార్తలను నిశితంగా గమనిస్తూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. కానీ వారు మంచి కోరుకుంటున్నా కూడా దైవం మాత్రం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆదమరిచి ఉండటంతో వారి రెండేళ్ల పాప నీటి డ్రంబులో పడి ప్రాణాలు కోల్పోయింది.

తమిళనాడు త్రెస్పురం గ్రామంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మూడేళ్ల పసిపాప రేవతి సంజన నిన్న రాత్రి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి చనిపోయింది. ఆ సమయంలో పాప తల్లిదండ్రులు బోరుబావిలో పడిపోయిన సుజిత్ గురించి టీవీలో వస్తున్న వార్తలు చూస్తున్నారు. ఫలితంగా వారు చిన్నారిని గమనించలేదు. దీంతో ఈ అనుకోని సంఘటన  జరిగిపోయింది. తరువాత కొద్దిసేపటికి పాప నీటి డ్రంబులో విగతజీవిగా ఉండటం చూసి తల్లీదండ్రులు నిశ్చేష్టులైపోయారు. హుఠాహుఠిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us