పిచ్చికుక్కల దాడిలో 15మందికి గాయాలు

హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. భ్రమరాంభికనగర్‌లో పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 15మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తరుచుగా పిచ్చికుక్కలు దాడి చేసినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. మల్కాజ్ గిరి ప్రాంతంలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు […]

పిచ్చికుక్కల దాడిలో 15మందికి గాయాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:37 PM

హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. భ్రమరాంభికనగర్‌లో పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 15మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తరుచుగా పిచ్చికుక్కలు దాడి చేసినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. మల్కాజ్ గిరి ప్రాంతంలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.