AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఎన్నికలకు ‘సిద్ధం’పై వైసీసీ సన్నాహక సమావేశం.. ఆ కీలక నేతలు గైర్హాజరు

తిరుపతిలో వైసీపీ సిద్ధం సభ సన్నాహక సమావేశం జరిగింది. వైసీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. టిక్కెట్‌ దక్కని కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాయలసీమను క్లీన్‌స్వీప్‌ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

CM Jagan: ఎన్నికలకు 'సిద్ధం'పై వైసీసీ సన్నాహక సమావేశం.. ఆ కీలక నేతలు గైర్హాజరు
YSRCP
Raju M P R
| Edited By: |

Updated on: Jan 29, 2024 | 7:16 PM

Share

తిరుపతిలో వైసీపీ సిద్ధం సభ సన్నాహక సమావేశం జరిగింది. వైసీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. టిక్కెట్‌ దక్కని కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాయలసీమను క్లీన్‌స్వీప్‌ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార YSRCP ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. మొన్న ఉత్తరాంధ్రలోని భీమిలిలో భారీ సభను నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురంజిల్లాలోనూ సిద్ధం పేరుతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ తిరుపతిలో సన్నాహక సభను నిర్వహించారు. ఇందులో రాయలసీమలోని 49 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సన్నాహక సమావేశంలో సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, రాష్ట్రంలోనే ఓ పెద్దసభగా దీన్ని నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు సీమలో ఓడిపోయిన 3 స్థానాల్లోనూ గెలిచేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. తనపై కోనేరు ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను అవినీతిపరుడో కాదో.. జిల్లా ప్రజలకు తెలుసన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

ఇవి కూడా చదవండి

మరోవైపు అనంతపురంలో జరిగే “సిద్ధం” సభ నిర్వహణకు సన్నాహకంగా జరిగిన ఈ సమావేశానికి కొందరు నేతలు డుమ్మా కొట్టారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేలంతా హాజరుకాలేదు. వారిలో రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు ఆదిమూలం, MS బాబు, నవాజ్‌ బాషా, తిప్పేస్వామి, మేడ మల్లిఖార్జునరెడ్డి, సిద్ధారెడ్డి హాజరుకాలేదు. మరోవైపు కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకుండానే సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సన్నాహక సమావేశానికి ఏకంగా పదిమందికిపైగా ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!