AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించండి.. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం జగన్

మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని తెలిపారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు

YS Jagan: గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించండి.. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం జగన్
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2023 | 11:49 AM

Share

మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని తెలిపారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక మార్పులు తీసుకోచ్చామని పేర్కొన్నారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, శాసనమండి డిప్యూటీ చైర్మన్‌గా మహిళకు అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని.. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని.. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ప్రభుత్వం గౌరవిస్తోందంటూ వివరించారు.

ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌ రిజర్వేషన్‌లు అమలు చేశారని.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని.. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇంత సంక్షేమం జరగలేదన్నారు. అన్ని రంగాల్లో మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. సాధికారతను మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించామని తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తుచేసుకున్న సీఎం జగన్.. ఆయన జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రంలో లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామని.. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని.. అన్ని వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..