AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathya Sai District: పరిటాల శ్రీరామ్‌కు సీటు కన్ఫామ్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

నారా లోకేశ్ తనపై చేసిన వ్యాఖ్యలపై మరోసారి కాస్త ఘాటుగా రియాక్టయ్యారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. 2014 గూగుల్ మ్యాప్ చూయించి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన మరిన్ని పొలిటికల్ కామెంట్స్‌పై ఓ లుక్ వేద్దాం పదండి.

Sathya Sai District: పరిటాల శ్రీరామ్‌కు సీటు కన్ఫామ్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
Paritala Sriram vs Kethireddy Venkatarami Reddy
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2023 | 9:08 PM

Share

లోకేష్ తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలపై మరోసారి ఘాటుగా స్పందించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తన పేరుతో భూములు కబ్జా చేసి ఉంటే వారిని చెప్పుతో కొట్టాలని…  అది అబద్ధమని తేలితే ఆరోపణలు చేసినవారిని దేనితో కొట్టాలని ప్రశ్నించారు.  ముందు చెరువు కబ్జా అన్నారు.. తర్వాత 45 ఎకరాలు అన్నారు… 2014 గూగుల్ మ్యాప్ చూపించి జనాల్ని నమ్మించాలని చూస్తున్నారని కేతిరెడ్డి ఫైరయ్యారు. ముదిగుబ్బలో తన అనుచరులు కబ్జా చేసి ఉంటే.. వారు ఎక్కడైనా సంతకం పెడతారని.. ఆ భూములు ప్రభుత్వం తీసుకోవచ్చని చెప్పారు.

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా బోర్డులు పెట్టించిందే తానని చెప్పారు కేతిరెడ్డి. తన పేరు ఎక్కడైనా ఉపయోగిస్తే ఈడ్చి కొడతానని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాకి వచ్చి లోకేష్ రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తన తాత ఖర్జూర్ నాయుడు అని చెప్పుకోకుండా ఎన్టీఆర్ అని లోకేశ్ ఎందుకు చెప్పుకుంటున్నాడని ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్ ఏమైనా కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి వచ్చారా అంటూ సెటర్లు వేశారు. వారు అనంతపురం, రాప్తాడులో చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు.

కమ్మ వాళ్లలో పరిటాల రవి మాత్రమే చంపబడ్డారని.. అందుకే ఆయన హీరో అయ్యారు తప్ప వేరే ఏమీ లేదన్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గంలో ఫ్యాక్షన్ కారణంగా సందుకు ఇద్దరు చనిపోయారని కేతిరెడ్డి చెప్పారు. పరిటాల శ్రీరామ్‌కు టీడీపీ నుంచి టికెట్ కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ చెప్పారు కేతిరెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.