AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతపురంకు రెండు భారీ పరిశ్రమలు.. ఉత్తర్వులు జారీ..!

అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు అవ్వబోతున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది.

అనంతపురంకు రెండు భారీ పరిశ్రమలు.. ఉత్తర్వులు జారీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2020 | 7:55 AM

Share

అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు అవ్వబోతున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అవి ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా అనంతపురం కియా మోటార్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేసే సమయంలో 2017లో అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 151 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం కియా చుట్టుపక్కల 10కి.మీల పరిధి వరకు కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో అప్పటికే ఒప్పందం కుదిరినప్పటికీ రెండు పరిశ్రమల ఏర్పాటు ఆగిపోయింది. తాజాగా ఆ జీవో నుంచి ఈ రెండు పరిశ్రమలకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఆ రెండు పరిశ్రమలకు ఆ జీవో నుంచి మినహాయింపు లభించింది. ఇక ఈ ఉత్తర్వుల నేపథ్యంలో వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్‌ అండ్ డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌లు అనంతపురం జిల్లాకు రానున్నాయి. ఈ క్రమంలో వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1000కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతుండగా.. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌కు కూడా అడ్డంకులు తొలిగాయి.

Read This Story Alos: కరోనా వైరస్.. ఆ సర్టిఫికేట్ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్..!