హీరో సూర్య తండ్రిపై టీటీడీ కేసు

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేసినవారిపై టీటీడీ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి నటుడు శివ కుమార్‌ కూడా ఉన్నారు.

హీరో సూర్య తండ్రిపై టీటీడీ కేసు
Follow us

|

Updated on: Jun 06, 2020 | 5:31 PM

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేసినవారిపై టీటీడీ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి నటుడు శివ కుమార్‌ కూడా ఉన్నారు. తిరుమల దేవస్థానానికి వెళ్ళొద్దని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని శివకుమార్ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. అంతటితో ఆగకుండా మరో కామెంట్ కూడా జోడించారు. తిరుమల కొండపై వీఐపీలు స్నానాలు లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అలాంటివారిని దగ్గర ఉండి దేవస్థానం అధికారులు దర్శనాలు చేయిస్తున్నారని కామెంట్ చేశారు శివకుమార్. అయితే ఈ విషయాలను టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు తమిళనాడుకు చెందిన మయ్యన్ అనే ఓ భక్తుడు.