వైఎస్సార్కు సీఎం జగన్ ఘన నివాళి
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. తన తండ్రి వైఎస్సార్కు సీఎం జగన్, విజయమ్మ, భారతి, షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వారితో పాటు వైసీపీ నాయకులు నేతలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్డ్డి, వైఎస్సార్ అభిమానులు నివాళులర్పించారు. ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం పులివెందుల […]
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. తన తండ్రి వైఎస్సార్కు సీఎం జగన్, విజయమ్మ, భారతి, షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వారితో పాటు వైసీపీ నాయకులు నేతలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్డ్డి, వైఎస్సార్ అభిమానులు నివాళులర్పించారు.
ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలతో పాటు, పులివెందుల అభివృద్ధిపై సమీక్షలో సీఎం హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.